తెలంగాణాకి రూ.450 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని తరచూ తెరాస నేతలు విమర్శిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ తెలంగాణాను చిన్న చూపు చూస్తోందని వారి వాదన. ప్రధాని నరేంద్ర మోడి విదేశాలలో పర్యటిస్తారు తప్ప కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రానికి రావడానికి ఇష్టపడారని మంత్రి కె.టి.ఆర్. విమర్శించడం అందరూ విన్నారు. కానీ తెరాస నేతల విమర్శలు, ఆరోపణలు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవేనని అందరికీ తెలుసు. అయితే తెలంగాణా బీజేపీ నేతలు ఎవరూ కూడా వారు చేస్తున్న ఈ విమర్శలను, ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టలేకపోవడంతో అవి నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా బీజేపీకి మంచి పట్టున్న హైదరాబాద్ జంట నగరాలలో కూడా ఓటమి పాలయింది.

కేంద్రప్రభుత్వం ఆంధ్రాతో సమానంగానే తెలంగాణాను కూడా చూస్తోంది. ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసి తమ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేయమని కోరగా, అందుకు అంగీకరించి తక్షణమే రూ. 450 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల వలన తెలంగాణాలో త్రాగునీరు సాగు నీరు సమస్యలు తీరే అవకాశం ఉండటంతో అవి కేంద్రాన్ని, దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలని చాలా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలలో వెనుకబడిన గ్రామాలలో ఈ ప్రాజెక్టుల అమలు చేయడం కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటికే కాకుండా ఇంకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్చ భారత్ వంటి అనేక కేంద్ర పధకాల క్రింద కూడా తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉదారంగా నిధులు మంజూరు చేస్తోంది.

అయితే వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడంలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు తీవ్ర అశ్రద్ద చూపిస్తుండటం వలన, ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఒకవైపు ఈవిధంగా కేంద్రప్రభుత్వం నుంచి భారీగా నిధులు అందుకొంటూనే తిరిగి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. అంతే కాక కేంద్రం మంజూరు చేస్తున్న ఆ నిధులతో చేపడుతున్న పధకాలను, అభివృద్ధి పనులను తమ స్వంతవిగా చెప్పుకొని రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయి. అందుకే మార్చి 6న రాజమండ్రిలో బీజేపీ బారీ బహిరంగ సభ నిర్వహించి తమ ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, సహాయ సహకారాల గురించి చెప్పుకోబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close