జగన్ నిర్ణయాలపై కేంద్రం రివ్యూ చేస్తుందంటున్న సుజనా..!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని… త్వరలో సమీక్షించి.. ఏం చేయాలో నిర్ణయిస్తుందని… కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఢిల్లీలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు నిర్ణయంపై.. కేంద్ర జలశక్తి మంత్రి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతి రోజునే… సుజనా చౌదరి మీడియా సమావేశం పెట్టి.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనులన్నింటినీ రద్దు చేసుకుంటూ పోతే.. రాష్ట్రంవైపు ఏ పారిశ్రామికవేత్త కూడా రాడని.. సుజనా చౌదరి అంటున్నారు., ఉన్న వాళ్లే వాళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుకుంటున్న నిర్ణయాలన్ని వ్యక్తిగత ద్వేషంతోనే తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు…వ్యక్తిగత దూషణలతోనే ముగిసిపోయాయని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని.. సుజనా చౌదరి తన మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలన్నింటిపై.. అధ్యయనం చేస్తామని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వ పరంగా.. ఎలాంటి ఆటంకం లేదని.. కావాల్సినన్ని నిధులు.. అందుబాటులో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం చేతిలోనే ఉంటే.. నిర్మాణం వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో… రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చారని… గుర్తు చేశారు. ప్రతీది రద్దు చేసుకుంటూ పోతే… ఏపీకి నష్టం జరుపుతుందన్నారు. ఓ సారి కాంట్రాక్ట్ ఎవరికైనా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారినా… పనులు ఆపి.. వేరే వారికి కాంట్రాక్టులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్యాంకులు కూడా ఏపీకి రుణాలివ్వవని ఆవేదన వ్యక్తం చేశారు.

సుజనా చౌదరికి.. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు.. ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీకి సంబంధించిన.. వ్యవహారాలు ఆయనకే కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ తరపున.. కేంద్రంలో మంత్రిగా ఆయనకే అవకాశం దక్కబోతోందని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరి.. ఇలా ఢిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి.. ఏపీలో పరిస్థితులపై కేంద్రం అధ్యయనం చేస్తుందని… ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం.. రాజకీయవర్గాల్లో కాస్త సంచలనాత్మకమైన విషయంగానే మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close