తూచ్.. పోలవరానికి ఆ డబ్బులూ ఇవ్వట్లేదు..!

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూ. 1850 కోట్లు విడుదల చేసినట్లు మూడు రోజుల కిందట.. ప్రకటన వచ్చింది. కానీ ఆ డబ్బులు రావాలంటే.. ఏపీ సర్కార్ తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. దానికి కూడా స్వయం కృతమే కారణం. ప్రత్యక్షంగా..అనేక రకాల సాకులు చెబుతున్నప్పటికీ.. అసలు కారణం.. ఏపీ సర్కార్… గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తూండటమే. ఆ విచారణ పూర్తయిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ రూ. 1850 కోట్లు విడుదలైతే.. తాత్కలికంగా.. కొన్ని పనులైనా చక్కబెట్టుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కేంద్ర ఆర్థిక శాఖ పెడుతున్న మెలికలు.. మెలికలు తిరిగిపోయేలా చేస్తోంది.

గత ప్రభుత్వం పోలవరం హయాంలో బోలెడన్ని అక్రమాలకు పాల్పడిందని.. వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. కేంద్రం అధీనంలో ఉండే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ మొత్తం వ్యవహారాలను డీల్ చేస్తుంది. అవినీతి జరిగితే.. దానికీ అంటుంకుంటుంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. జగన్ .. బంధువు రేమండ్ పీటర్ అనే మాజీ అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసి… రూ. వేల కోట్ల అక్రమాలని నివేదిక తెప్పించింది. దీన్ని ప్రధానికి కూడా సమర్పించింది. తీరా ఆధారాలు సమర్పించమనేసరికి… ఆ కమిటీ నివేదికతో తాము ఏకీభవించడం లేదని.. యూటర్న్ తీసుకుంది. అయితే.. అంతటితో వదిలి పెట్టలేదు. విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. దాంట్లో పీపీఏ అధికారి కూడా భాగం కావాలని.. ఇటీవల కేంద్రం నిర్ణయించింది.

ఒక వేళ.. విజిలెన్స్ విచారణలో నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలితే.. ఆ నిధులు.. ఏపీకి చెల్లించాల్సిన పని లేదు. ఎంత మేర పని జరిగితే.. అంత మేర మాత్రమే నిధులు చెల్లిస్తారు. అందుకే… ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ… రూ. 1850కోట్లను పెండింగ్ లో పెట్టేశారు. విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అంటే.. ఇప్పుడల్లా ఆ నిధులు రావు. నిధులు ఇవ్వాలంటే.. విజిలెన్స్‌తోనూ క్లీన్ చిట్ ఇప్పించాల్సిన పరిస్థితి. చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటే.. ఇప్పుడు వైసీపీ సర్కార్ .. పరిస్థితి లాంటిదేనన్న సెటైర్లు.. ఢిల్లీలో గట్టిగానే పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close