రెండు రోజులు ఢిల్లీలో పవన్ కల్యాణ్ చేసిందిదే..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. శుక్రవారం ఉదయం.. విజయవాడలో డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాలను ప్రారంభించిన తర్వాత నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. కానీ ఎందుకు చేరుకున్నారు..? ఎవరితో సమావేశం అవుతారు..? ఎజెండా ఏమిటన్నదానిపై.. క్లారిటీ లేదు. కానీ పవన్ కల్యాణ్.. తాను ఢిల్లీలో ఉన్నానని.. కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నానన్న ఓ సంకేతాన్ని… సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. ఢిల్లీ మీడియాకు ఏపీ ప్రభుత్వంపై ఇలాంటి అభిప్రాయం ఉందంటూ.. కార్టూన్లు, పేపర్ కటింగ్స్‌ పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ రెండు రోజులు.. మీడియా అటెన్షన్ లేకుండానే ఢిల్లీలో గడిపారు. తాను ఎక్కడికి వెళ్లారు.. ఎవరెవరితో భేటీ అయ్యారన్న సమాచారాన్ని బయటకు రానీయలేదు. కానీ కొంత మంది కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారని మాత్రం చెబుతున్నారు. అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయి కాబట్టే.. ఆయన హడావుడిగా ఢిల్లీ వెళ్లారని.. భేటీలు కూడా జరిగాయని చెబుతున్నారు. సహజంగా… ఆ సమావేశాలు రహస్యంగా ఉంచాలనుకుంటే బయటకు రావు. పవన్ తన భేటీల విషయం…తాను చెప్పుకుంటానని.. ఫోటోలు మీడియాకు విడుదల చేయవద్దని.. ఆ ప్రముఖులకు ముందుగానే చెప్పినట్లుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్.. ఢిల్లీ పర్యటన.. కీలకమైనదేనని.. దాని వెనుక ప్రత్యేకమైన అజెండా ఉందని.. వైసీపీ కూడా నమ్ముతోంది. ఎప్పుడూ లేనిది పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినప్పటి నుండి ఆ పార్టీ నేతలు… ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఒక సారి చంద్రబాబు పంపారని.. మరోసారి..ఎప్పుడూ వెళ్లనిది ఇప్పుడే ఎందుకు వెళ్లారని.. ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తే.. వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఢిల్లీలో అసలేం జరిగిందో.. పవన్ కల్యాణ్.. నేరుగా వెల్లడించే వరకూ.. ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారో బయటకు రావడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close