జిల్లాలపై చంద్రబాబుదీ పవన్ కల్యాణ్ మాటే !

జనసేన , టీడీపీ జిల్లాల విభజనపై ఒకే మాట మీద ఉన్నాయి. జిల్లాలు శాస్త్రీయంగా విభజన చేయలేదని.. రాజకీయ అవసరాల కోసమే విభజించారని.. ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని.. పరిగణనలోకి తీసుకోలేదని తాము వచ్చాక మార్చేస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. ముందుగా పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తామని నేరుగా చెప్పలేదు కానీ.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్ వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే చెప్పారు. జిల్లాల విభజనలో జరిగిన తప్పులను సవరిస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన జిల్లాల విభజన విషయంలో ఒకే మాట మీదకు వచ్చినట్లయింది. ఈ విషయంలో బీజేపీఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తాము వచ్చిన తర్వాత జిల్లాలను మారుస్తామనో.. లేదో ఇంకా ప్రకటించలేదు.

నిజానికి ప్రభుత్వం చేసిన విభజన విషయంలో చాలా జిల్లాల్లో అసంతృప్తి ఉంది. తాము ఏదో కోల్పోయామని ప్రతి జిల్లా వాసులు అనుకుంటున్నారు. దీని వల్ల కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా ఎక్కడా ప్రజల్లో కదలిక కనిపించలేదు. ఓ రకమైన నిరుత్సాహమే కనిపించింది. ఖర్చు చేయడానికి నిధుల్లేకపోవడంతో ప్రభుత్వం కూడా వీలైనంత వర్చువల్‌గానే కార్యక్రమాలు పూర్తి చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close