అలర్ట్‌ లీడర్స్‌ : చిత్తశుద్ధి ఉంటే పెదవివిప్పాలి!

గర్జన ప్రభావమో… ఆ సందర్భంగా ఉద్యమం దారితప్పి హింసగా మారిన ప్రభావమో తెలియదు గానీ.. కాపు రిజర్వేషన్‌లకు సంబంధించిన చర్చ ప్రస్తుతం పతాకస్థాయిలో ఉన్నది. ఈ కీలక సమయంలో చంద్రబాబునాయుడు ఒక అత్యంత ప్రధానమైన చర్చకు తెరతీశారు. కాపులను బీసీల్లో చేరుస్తూ తక్షణం జీవో విడుదల చేసేయాలా? లేదా శాస్త్రీయ పద్ధతిలో కమిషన్‌ ద్వారా అధ్యయనం చేసి.. ముందుముందు న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చేయాలా? అనే మీమాంసను కాపు నాయకుల విజ్ఞతకే వదిలిపెట్టారు. మంగళవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాపు నాయకులతో ఆయన ఈ మేరకు ఒక సమావేశం పెట్టుకుని, వారందరి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చినా రాకపోయినా, మీడియా లేదా బహిరంగ లేఖల రూపంలో అయినా సరే కాపుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు కూడా ఈ విషయంలో తమ నిర్దిష్టమైన అభిప్రాయాన్ని బహిరంగపరచవలసిన కీలకమైన తరుణం ఇది.

జాట్‌లను బీసీల్లో చేర్చడాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసినట్లుగా కాపుల పరిస్థితి కూడా తయారు కాకుండా ఉండడానికి, శాస్త్రీయ బద్ధమైన అధ్యయనం ద్వారా వారిని బీసీలు చేయడానికి తాను ప్రయత్నం చేస్తూఉండగా.. విపక్షాలు దాన్ని రాజకీయం చేస్తూ తప్పుపడుతున్నాయనేది చంద్రబాబునాయుడు ఆవేదన! అయితే కమిషన్‌ అనేది కాలయాపన అని ఆయన ప్రత్యర్థులు వాదిస్తున్నారు. కాపు ఉద్యమం ఇంత ముదిరిన తర్వాత.. ప్రత్యర్థుల వాదనను కూడా చంద్రబాబు కాదనడం లేదు. మీరు చెప్పినట్లు చేయడానికి కూడా రెడీ..! తక్షణం జీవో ఇచ్చేస్తా.. కోర్టులు దానిని కొట్టివేస్తే.. నన్ను నిందించకుండా మీరు బాధ్యత వహిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

కాపులు రాష్ట్రంలో ఒక పెద్ద కులంగా ఉన్నారు గనుక.. వారి ప్రాపకాన్ని సంపాదించుకోవడానికి ప్రతి పార్టీ కూడా అత్యుత్సాహపడడం సహజం. కాపులు ఇప్పుడు ఉద్యమిస్తోంటే.. సహజంగా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. విపక్షాలు అన్నీ కాంగ్రెస్‌, వైకాపాలు ఆ ఉద్యమానికి బహిరంగ మద్దతు ఇస్తూన్నారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. అయితే కేవలం కాపుల విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవడం కోసం చూడకుండా నిజంగా సమస్య పరిష్కారాన్ని కోరుకునే ప్రతి పార్టీకి చెందిన ప్రతి నాయకుడు కూడా ముద్రగడ పద్మనాభం అయినా, జగన్‌ అయినా, రఘువీరారెడ్డి అయినా, చిరంజీవి అయినా.. ఈ పార్టీల్లోని కాపు ప్రముఖులు అయినా ఎవరైనా సరే.. జీవోనా? అధ్యయనమా? అనే విషయంలో తమ తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. బాబుకు చెప్పడం తమకు చిన్నతనంగా భావిస్తే.. బహిరంగ లేఖల రూపంలో ప్రజల ముందు తమ అభిప్రాయాలు విస్పష్టంగా ఉంచాలి. అలా చేయకుండా.. చిచ్చు ఎంతవరకు రగులుతుందో చూద్దాం.. ఆ తర్వాత.. ప్రభుత్వాన్ని ఎలా నిందించవచ్చునో ఆలోచిద్దాం అనుకుంటూ గడిపితే అది చాలా పెద్ద సామాజిక ద్రోహం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close