తిరుపతిలో నిర్బంధం : చంద్రబాబుకు మాత్రమే కోడ్, కోవిడ్ రూల్సా..?

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. నాలుగు గంటల నుంచి ఆయన ఎయిర్‌పోర్టులోనే కింద కూర్చుని నిరసన తెలియచేస్తున్నారు. మంచినీళ్లు కూడా తాగలేదు. మధ్యాహ్న భోజనాన్ని తిరస్కరించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులను బెదిరించడం, పోటీ చేయకుండా చేయడం.. నామినేషన్లు వేసిన వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వ్యవహారాలపై చిత్తూరులో నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు వెళ్లారు. అయితే ఆయన చిత్తూరు ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు. వెళ్లడానికి పర్మిషన్ లేదని అడ్డు పడ్డారు. ఎందుకు లేదంటే… ఎన్నికల కోడ్ తో పాటు కోవిడ్ రూల్స్ ప్రకారం అంటూ నోటీసులు చేతిలో పెట్టారు. దీంతో చంద్రబాబు ఎయిర్‌పోర్టులోనే కింద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్చ ఉంది. ఏపీ పౌరుడిగా అది ఆయన హక్కు. కానీ.. అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు నిరనన తెలియచేయడానికి ఈసీ వద్ద పర్మిషన్ తీసుకున్నామని టీడీపీ వర్గాలు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. తమకు సమాచారం లేదని వాదించారు. చంద్రబాబు వద్దకే.. ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులు వచ్చి.. చర్చలు జరిపారు. వెనక్కి వెళ్లాలని కోరారు. అయితే చంద్రబాబు ససేమిరా అన్నారు. చిత్తూరుకు వెళ్లి … పార్టీ తరపున నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతానని ఆయన పట్టుబట్టారు.

చంద్రబాబును రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంపై టీడీపీ భగ్గుమంది. చంద్రబాబుకు రేణిగుంటలో ఇచ్చిన నోటీస్‌ చూస్తే పోలీసులు బుర్ర పెట్టి పనిచేస్తున్నారా లేదా అర్థం కావడం లేదని ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇతర టీడీపీ నేతలు ఇదేం పాలన అని విమర్శించారు. ఎమర్జెన్సీ కన్నా ఘోరంగా పరిస్థితి ఉందన్నారు. పలు చోట్ల టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఘటనపై వైసీపీ నేత … అనధికారిక హోంమంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్సతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో చంద్రబాబు చిత్తూరు ఎలా వెళ్తారని సజ్జల, బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు.

ఓ వైపు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాదయాత్రలు చేస్తున్నారు. క్రికెట్ కిట్లు బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. వీరెవరికీ ఎన్నికల కోడ్ కానీ. కోవిడ్ యాక్ట్ కానీ అమలు కావడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ పరమైన నిరనన వ్యక్తం చేయడానికి వెళ్తే పోలీసులు అటకాయించారు. ఏపీలో ఒక్క అధికార పార్టీ నేతలు మాత్రమే తిరగాలని.. వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని.. ప్రచారం చేసుకోవాలన్నట్లుగా పోలీసుల తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విశాఖలోనూ అదే తరహాలో చంద్రబాబును అడ్డుకున్నారు. అప్పట్లో పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశాలిచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close