పట్టిసీమ ఒక గొప్ప ప్రాజెక్టు…కాదు అదొక వేస్ట్ ప్రాజెక్టు!

పట్టిసీమ-పోలవరం ప్రాజెక్టులపై మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మధ్య చాలా తీవ్రమయిన మాటల యుద్ధం జరిగింది. కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కృష్ణా మొదలయిన జిల్లాలకి నీళ్ళు అందించగల ఆత్యద్భుతమైన ప్రాజెక్టు పట్టిసీమ అని చంద్రబాబు నాయుడు చెప్పుకొంటే, నీళ్ళను ఉంచుకొనేందుకు స్టోరేజి సౌకర్యం లేని పట్టిసీమ ఒక పిచ్చి ప్రాజెక్టు, దాని కోసం రూ.1,600 కోట్ల ప్రజాధనం నీటిపాలు చేసేరని జగన్ విమర్శించారు.

దానికి చంద్రబాబు నాయుడు బదులిస్తూ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు, పట్టిసీమ గురించి నేను చెప్పిందంతా విన్న తరువాత మళ్ళీ నీళ్ళకి స్టోరేజి లేదని జగన్ వితండవాదం చేస్తున్నాడని విమర్శించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టుకొని అన్ని జిల్లాలకు పారించి ఎక్కడికక్కడ స్టోరేజి చేసుకోవచ్చును. దేనిగురించయినా మాట్లాడేముందు సబ్జెక్ట్ తెలుసుకొని, అర్ధం చేసుకొని మాట్లాడితే మంచిది,” అని చంద్రబాబు బదులిచ్చారు.

అప్పుడు జగన్ కూడా చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. “తెలియని వ్యక్తికి చెప్పవచ్చును. తెలిసిన వ్యక్తితో మాట్లాడవచ్చును. కానీ అన్నీ నాకే తెలుసనుకొనే అజ్ఞానితో మాట్లాడటం కష్టం. చంద్రబాబు పరిస్థితి కూడా అదే. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కుడికాలువ త్రవ్వించబట్టే ఈనాడు దానిలో ఇన్ని నీళ్ళు పోసి అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. 180 టి.ఎం.సి. ల నీళ్ళు అవసరమయిన కృష్ణ డెల్టాకి ఈయన కేవలం 4 టి.ఎం.సి. ల నీళ్ళు అందించి, మొత్తం డెల్టాని కాపాడేసినట్లు గొప్పలు చెప్పుతుంటే మేమందరం చెవులలో పువ్వులు పెట్టుకొని వింటూనే ఉంటాము,” అని ఎద్దేవా చేసారు.

దానికి చంద్రబాబు నాయుడు బదులిస్తూ “రాయలసీమలో ప్రతీ జిల్లాకు నీళ్ళు అందించాలని మేము పరితపిస్తుంటే, ఏదేదో అర్ధం పర్ధం లేకుండా నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతూ జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. జగన్ అడ్డు పడినా, వైకాపా ఎమ్మెల్యేలే అడ్డుపడినా రాయలసీమలో ప్రతీ జిల్లాకి, గ్రామానికి పట్టిసీమ ద్వారా నీళ్ళు పారించి తీరుతాము. వైకాపా ఎమ్మెల్యేల నియోజక వర్గాలకి కూడా వారు అడ్డుపడినా నీళ్ళు పారించి తీరుతాము. ఒకవేళ అడ్డుపడితే అదే విషయం ప్రజలకి కూడా చెపుతాము,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close