బీజేపీ నేతలకు పరామర్శల్లో బాబు బిజీ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖాళీగా ఉన్నారు. సీఎంగా ఉంటే… ఆయనకు తీరిక ఉండేది కాదు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను కూడా ఆన్ లైన్ ద్వారా చేసేస్తూ.. భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వ్యూహాల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలకు ఏదైనా కష్టం వస్తే మాట కంటే ముందే ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. గతంలో అమిత్ షా కరోనా బారిన పడి కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి , రెండు సార్లుఫోన్ చేసి.. బాగున్నారా అని పలకరించిన చంద్రబాబు .. తాజాగా మరోసారి ఫోన్ చేసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడారో లేదోస్పష్టత లేదు. అమిత్ షాకు ఫోన్ చేసి పరామర్శించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి గోయల్‌ను కూడా ఫోన్లో పలకరించారు. కిడ్నీలో రాళ్లు రావడంతో గోయల్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బీజేపీతో పరిచయాలు పెంచుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో రహస్యమేం లేదు. చంద్రబాబు మాటలు కలిపితే… ఎంతటి వారిననయినా.. తన ప్రతిపాదనలకు అంగీకరింపచేస్తారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.

కూటములు కట్టడం కానీ.. ఫలితాలను లాభాల వారీగా విశ్లేషించి చెప్పడంలోనూ ఆయన స్టైలే వేరని చెబుతారు. నిజంగా చంద్రబాబు..మళ్లీ బీజేపీని మచ్చిక చేసుకోవాలని అనుకుంటూంటే మాత్రం.. ఆయనకు ఈ ఫోన్ కాల్స్ బాగా ఉపయోగపడతాయి. చంద్రబాబు రాజకీయ చర్చల గురించి బాగా తెలుసు కాబట్టే..అధికార పార్టీ ఉలిక్కి పడుతోంది. బీజేపీతో మళ్లీ జట్టుకట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close