బకనచర్ల విషయంలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయాన్ని చంద్రబాబు క్లియర్ గా తేల్చి పడేశారు. ఎన్ని కావాలంటే అన్ని ప్రాజెక్టులు కట్టుకుని నీటిని ఆపుకోవాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. దిగువకు వచ్చే ప్రతి చుక్క తమదేనని ఆయన చెప్పకనే చెప్పారని అనుకోవాలి. గోదావరిపై పోలవరం మినహా ఏ ప్రాజెక్టుకు అనుమతి రాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాళేశ్వరం సహా గోదావరి మీద కట్టిన ఏ ప్రాజెక్టుకూ తాను అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు బనకచర్ల విషయంలో గొడవపడటం ఎందుకని ప్రశ్నించారు.
ఎగువ తెలంగాణలో ఎన్ని నీళ్లు ఆపుకున్నా.. దిగువకు వచ్చే నీటిని మాత్రమే తాము మళ్లించుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానం చేస్తున్నామని.. గోదావరి నీటిని ఎత్తిపోసుకుంటే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. సముద్రంలోకి పోయే నీటిని ఎత్తిపోసుకుంటే తెలంగాణకు నష్టం ఏముంటుందని ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో చంద్రబాబు చాలా క్లియర్ గా ఉన్నారు. నదుల అనుసంధానాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంది. గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా బనకచర్లకు నిధులు సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దిగువ రాష్ట్రమైన ఏపీ.. ఏ విధంగానే తెలంగాణ నీటిని తీసుకునే అవకాశం ఉండదు. బ్యారేజీల్లో నిల్వ ఉన్న జలాలలను తీసుకునే విషయంలో ఒప్పందాలు ఉన్నాయి. కానీ సముద్రంలోకి వేల టీఎంసీలు పోతూంటే.. తీసుకోకూడదన్న రూల్ లేదు. సముద్రంలోకి పోయే జలాలను ఏపీ ఖాతాలో వేసి మాట్లాడుతూంటారు. మరి ఆ నీటిని ఏపీ తరలించుకుంటే నష్టమేంటో మాత్రం ఎవరూ చెప్పలేరు. మోకాలికి, బోడిగుండుకు లంకెపెట్టి..బనకచర్లను వివాదం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా కేంద్రమంత్రిని కలిసి ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని కోరారు.