అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే అమరావతిలో రాజధాని.. !

అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగానే అమరావతిని రాష్ట్రం మధ్యలో పెట్టామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిని మరోసారి మీడియా ముందు పెట్టారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని … రాజధానిని కాపాడుకోవడం అందరి బాధ్యతనిచ చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి ఏర్పాటు చేశామని..ఇతర ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టామో…చంద్రబాబు వివరించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీకి 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు విజయవాడలో రాజధాని ఉండాలని అభిప్రాయం చెప్పారన్నారు. 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించామని 160 ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. అదే అభివృద్ధి వికేంద్రీకరణ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయని … ఇప్పడు హైదరాబాద్‌ తెలంగాణకు ఆయువు పట్టుగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీ ఒక్కటేననని.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుందనిప్రశఅనించారు. విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ..గంగవరం పోర్టును తానే తీసుకొచ్చానని …విశాఖ ఇప్పటికే ఫార్మా రాజధానిగా ఉందన్నారు. టూరిజం హబ్‌గా తీర్చిదిద్దామన్నారు.

వైసీపీ నాయకులకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టి భజన చేయడం తప్ప.. అభివృద్ధి చేయడం రాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నా స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసమన్నారు. నన్ను ఏం చేయలేక.. తనపై కులుం ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని … ఇప్పుడు పోరాడకపోతే.. మనం తీవ్రంగా నష్టపోతామని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close