చివరి బాల్ వరకూ ఆడాలనుకుంటున్న చంద్రబాబు..!

చివరి బాల్‌ వరకూ విజయం కోసం ప్రయత్నించేవారే నిజమైన ఆటగాడు..! విజయమో.. వీర స్వర్గమో.. తేల్చుకోవడానికి.. మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడ్డాయని.. ఇక ఓడిపోయినట్లేనని… వదిలేసి వెళ్లిపోయేవాడు.. ఎప్పటికీ .. గెలవడు. అది తెలిసిందే. చంద్రబాబు ఇప్పుడు.. మోడీని గద్దె దింపడానికి.. చివరి బాల్ వరకూ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో.. ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నా… ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం.. ఈ మూల నుంచి ఆ మూలకు.. ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతూనే ఉన్నారు.

మోడీ మళ్లీ ప్రధాని కాకూడదనేదే చంద్రబాబు లక్ష్యం..!

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి.. అది చేసిన మోడీకి కచ్చితంగా… షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు.. గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి… మిత్రపక్షాలన్నింటినీ ఏకం చేయాలనుకున్నారు. దాని ప్రకారం.. చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పట్ల ఢిల్లీ స్థాయిలో పార్టీలు సానుకూలత ప్రకటించినప్పటికీ… రాష్ట్రాల్లో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. అలా చేయడం వల్ల… ఓట్లు చీలిపోయి.. బీజేపీకి లాభం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే.. ఇద్దరికీ లాభమని.. చంద్రబాబు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా… వారు తగ్గలేదు. దాంతో.. బీజేపీకి ఎడ్జ్ వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు.

చంద్రబాబు ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపని ఎగ్జిట్ పోల్స్..!

ఇక .. ఎస్పీ, బీఎస్పీ కూటమిని.. కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేందుకు.. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాము కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలిగితే.. యూపీలో తమ పార్టీలకు ముప్పు వస్తుందేమోనని వారు వెనుకడుగు వేశారు. అదే సమయంలో వారు బీజేపీకి మేలు చేస్తున్నామన్న సంగతిని మర్చిపోయారు. ఫలితాల తర్వాత వారు కాంగ్రెస్ వైపు వస్తారని ఊహించినప్పటికీ… ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ రావడంతో… వారు కూడా ఆందోళనకు గురయ్యారు. మమతా బెనర్జీ కూడా… ప్రధానమంత్రి పదవిపై ఆశతో.. కూటమికి దూరంగా ఉన్నారు. అందర్నీ పదే పదే బుజ్జగించే ప్రయత్నంలో చంద్రబాబు ఎక్కడా అలసి పోవడం లేదు.

చివరి క్షణం వరకూ చంద్రబాబు ప్రయత్నాలు..!

ఎగ్జిట్ పోల్స్ తర్వాత చంద్రబాబు ప్రయత్నాన్ని చాలా మంది చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజార్టీ రాదని భావిస్తున్న ఆయన… తన ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితాలు వచ్చే వరకూ ప్రాంతీయ పార్టీలను కలిపి ఉంచాలనే లక్ష్యంతో పయనిస్తున్నారు. మరోసారి.. అన్ని పార్టీల నేతలను కలిసి.. ఉమ్మడిగా.. వీవీ ప్యాట్లు లెక్కింపుపై ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు చూసి.. చివరి బాల్ వరకూ ఆడేవారికి.. నిజమైన స్పిరిట్ ఉన్నట్లుగా… అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. చివరి క్షణం వరకూ.. మోదీని గద్దె దించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయనకు విజయం లభిస్తుందో… లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close