హామీలు రాని హడావుడి

Telakapalli-Raviముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ వెనువెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయిలుదేరారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు చాలామందిని కలిశారు. వారందరికీ తాను చేసిన విజ్ఞప్తులను చెప్పారే గాని వారేం చెప్పారో మాత్రం నిర్దిష్ట హామీలు వెల్లడించలేదు. ఎందుకంటే అలాటివి దాదాపు రాలేదు. కొద్ది రోజుల కిందట నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అరవింద్‌ పంగారియా విజయవాడలో ఆయనతో సమావేశమైనప్పుడే కేంద్రం విదిలింపులు స్వల్పంగా వుండబోతున్నాయని ముఖ్యమంత్రికి సమాచారం అందింది. 2016-17 కేంద్ర బడ్జెట్‌లో రు.3000 కోట్లకు మించి ఎపికి వచ్చే అందే అవకాశం లేదని పంగారియా స్పష్టంగా చెప్పారు. దాంతోహుటాహుటిన బయిలుదేరి వెళ్లారు. అమరావతికి రు.4000 కోట్లు, పోలవరంకు రు.8,000 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రు,13,799 కోట్లు కోరుతూ విజ్ఞప్తి పత్రాలుతీసుకెళ్లారు. పోలవరంకు ఇప్పటి వరకూ రు.2వేల కోట్లకు పైగా ఖర్చు చేసినందువల్ల వాటిని విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. వీటితో పాటే కొత్త రైల్వే పథకాలపైన సూచనలు చేశారు.ఈ అంశాలన్నీ విశదంగానే చెప్పారు గాని కేంద్రం కేటాయింపులపైన హామీలిచ్చినట్టు మాత్రం చంద్రబాబు చెప్పలేదు. ప్రత్యేక హౌదా సమస్యపై నీతి అయోగ్‌ నివేదిక అందిందని చెప్పిన ప్రధాని నిజంగా అది సానుకూలంగా వుంటే సూచన చేసి వుండేవారు.అయితే అది అనుకూలంగా లేదని తెలిసిన తర్వాతే ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగారు గాని.అది వచ్చేది కాదని రాష్ట్ర ఆర్థిఖ శాఖ ఎప్పుడో నిర్ధారించుకుంది. విజయవాడ పర్యటనలోనూ ఇటీవల ఢిల్లీలో వివిధ సందర్బాలలోనూ ఆయోగ్‌ చైర్మన్‌ పంగారియా ఇది స్పష్టంగానే చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ప్యాకేజీ కూడా ప్రకటించకపోతే దానిపైనా ఆశలు వదులుకోవలసిందే. అమరావతి విషయానికి వస్తే ఇచ్చిన వాటితో నిర్మాణాలు చేపట్టకుండా వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తున్నట్టు బిజెపి నేతలు చెబుతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ శంకుస్థాపన ప్రకటించి వాయిదా వేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అయోమయానికి నిదర్శనమని వారంటున్నారు. కనుక పర్యటన ఫలితం.. ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close