పోలవరంలో చంద్రబాబుకు “కోడ్” దెబ్బ..!

పట్టుబట్టి ముఖ్యమంత్రి హోదాలో పోలవరం పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు…ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్న అధికారులందరూ దూరంగా ఉన్నారు. కేవలం ప్రాజెక్టుకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు మాత్రం…చంద్రబాబు టూర్‌లో పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తదితరలు…చంద్రబాబు టూర్‌లో కనిపించలేదు. దీంతో చంద్రబాబు పోలవరం టూర్‌కి కోడ్ దెబ్బ పడినట్లయింది. పోలవరం ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు. చంద్రబాబు మొదట.. ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏరియల్ సర్వే చేశారు. తర్వాత ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు… గేట్ల బిగింపు… మెయిన్ డ్యామ్ పనులను పరిశీలించారు.

పోలవరం వ్యూ పాయింట్ నుంచి పనులు పరిశీలించారు. పోలవరం మెయిన్ డ్యామ్ వద్ద గేట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 70శాతం మేర పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తయ్యాయని.. అదికారులు చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చంద్రబాబు పోలవరంలో పర్యటించడం ఇదే తొలిసారి. పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛని.. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పోలవరం పూర్తయితే కరువును జయించవచ్చని.. ఈ ఏడాదే గ్రావిటీ ద్వారా సాగునీరందిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 980 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉందన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు రూ. 16,493 కోట్లు ఖర్చు చేశామని.. అయితే.. కేంద్రం రూ. 6727 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. .ఇంకా రూ. 4631 కోట్లు రావాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోలవరం రివ్యూ చేసినా…క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినా.. అధికారులు పెద్దఎత్తున హడావుడి చేసేవారు.కానీ ఈ సారి మాత్రం..ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వచ్చినా అధికారులు ఎలాంటి హడావుడి చేయలేదు. కోడ్ ఉందన్న కారణంగా..సీఎస్ ఆంక్షలు పెట్టడం.. సీఎస్ సీఎంకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపధ్యంలో.. అధికారులు.. ఎందుకైనా మంచిదని దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close