రామ్‌కు చంద్రబాబు సపోర్ట్..!

స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ ట్వీట్ చేయడం.. దానిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదంగా మారింది. తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో చెబితేనే ఆయనకు పోలీసులు నోటీసులిస్తామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. పోలీసులకు భయపడ్డారో మరో కారణమో కానీ..తాను ఇంక ఆ అంశంపై ట్వీట్లు చేయనని ప్రకటించారు. దాంతో పోలీసుల హెచ్చరికలు ఫలించినట్లయిది. అయితే.. పోలీసులు ప్రతి ఒక్కరిని ఇలా భయపెడుతున్నారా అన్న చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమయింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

రామ్‌పై ఏసీపీ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా… నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని … రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. మరో వైపు స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటన వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది..అది పూర్తిగా కులం కోణంలో సాగుతోంది. వైసీపీ నేతలు.. పోతినేని రమేష్ బాబు పేరును..రమేష్ చౌదరి అని పిలవడం ప్రారంభించారు.

దీంతో… ఓ వర్గం.. పూర్తిగా.. హోటల్ తప్పే కానీ.. వైద్యుల తప్పేముందని వాదించడం ప్రారంభించింది. రమేష్ బాబు ను కులం కారణంగానే వేధిస్తున్నారని.. ఆరోపణలు రావడానికి కారణం అయింది. అనుమతులు ఇస్తేనే..అక్కడ రోగుల్ని ఉంచి చికిత్స చేస్తున్నారని.. ఆ అనుమతులు ఇచ్చిన వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం టార్గెట్ ప్రకారం వెళ్లిపోతోంది. ఎవరి విమర్శలనూ లెక్క చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close