చంద్రబాబుకూ కరోనా పాజిటివ్ !

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకూ కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. నిన్న ఉదయమే చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆయన ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. తాజాగా కుటుంబసభ్యులకూ సోకినట్లుగా తెలుస్తోంది. గత రెండు వేవ్‌లలో వారికి కరోనా సోకలేదు. మూడో వేవ్‌లో మాత్రం అందరికీ పాజిటివ్‌గా తేలుతోంది. చంద్రబాబు ఇటీవల మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త హత్యకు గురైన సందర్బంగా ఆ గ్రామంలో పర్యటించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఈ సందర్భంగా ఆయనకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

గత రెండు విడతల్లో కరోనా బారిన పడని వారందరూ ఈ సారి వైరస్ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎక్కువగా అలాంటి వారికే పాజిటివ్‌ వస్తోంది. వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ వైరస్ సోకుతోంది. అయితే కరోనా ప్రభావం తక్కువ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో పధ్నాలుగు రోజులు క్వారంటైన్ ను ఇప్పుడు ఏడు రోజులకు తగ్గించారు. లక్షణాలు లేకపోతే టెస్టులు కూడా అవసరం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close