అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా… దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు. ఇలా తెలియచేసిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. చంద్రబాబు మాత్రం.. తన ప్రసంగంలో.. అమరావతిని కాపాడేది… కాపాడే సామర్థ్యం ఉన్నది.. ఒక్కరికేనని తేల్చారు. అది మరెవరో కాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రైతులకు సంఘిభావం తెలిపిన సందర్భంగా.. గతంలో అమరావతి గురించి చెప్పే గొప్ప మాటలతో పాటు.. ఈ సారి ప్రధాని మోడీ ఇచ్చిన హామీల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని హమీ ఇచ్చారని.. పార్లమెంట్‌ ఆవరణలోని మట్టి, యమునానది జలాలను తీసుకొచ్చి అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. అందుకే అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైన కూడా ఉందన్నారు. సేవ్‌ అమరావతి..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదం కొనసాగించాలని అమరావతి రైతులకు పిలుపునిచ్చారు. అమరావతి విషయంలో.. ఏపీ సర్కార్ ఇప్పుడు ముందడుగు వేయలేకపోతోంది. రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా ఉద్ధృతి పెరుగుతోంది కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో… రాజధానిని మార్చే ఆలోచనను.. జగన్ చేయకపోవచ్చంటున్నారు. ఈ మేరకు.. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్లు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం.. భారతీయ జనతా పార్టీతో.. వైసీపీ సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు ఇష్యూతో తమ వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం.. వైసీపీలో ప్రారంభమయింది. అందుకే.. వైసీపీ నేతలు బీజేపీపై ఎటాక్ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు..కూడా… అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. దీని ఆధారంగా.. చంద్రబాబు బీజేపీపై వ్యూహత్మకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో కానీ.. అమరావతి గురించి మోడీ ఇచ్చిన హామీలు.. వెలుగులోకి రావడానికి బీజేపీపై ఒత్తిడి పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close