మూడు నెలల తరువాత హైదరాబాద్ కి వస్తున్న బాబు

రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలలో నెలకొన్న అభద్రతా భావం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే సుమారు 13 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఆ తరువాత జరిగిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో అక్కడ తనకే భద్రతలేదని గ్రహించి విజయవాడకు మకాం మార్చేసారు. ఆ తరువాత ఆయన దేశావిదేశాలు అన్నీ తిరిగి వస్తున్నారు కానీ హైదరాబాద్ కి మాత్రం వెళ్ళడం లేదు. సుమారు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు ఆయన హైదరాబాద్ వెళుతున్నారు. కనుక ఇది కూడా ప్రత్యేకంగా పేర్కొనవలసిన వార్త అయింది. ఇకపై వారానికి రెండు రోజులు హైదరాబాద్ నుంచి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు.

జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.ఎం.సి.) ఎన్నికలు జరుగబోతునందున వాటి కోసం పార్టీని సిద్దం చేసేందుకు ఆయన మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి రావాలనుకొంటున్నారు. వచ్చే నెలలో జంట నగరాలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలలో తెదేపా-బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయి కనుక ఆయన బీజేపీ నేతలతో కూడా సమావేశమవుతారు. కేసీఆర్ తో కొత్తగా కుదిరిన దోస్తీ భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో ఆయన స్వయంగా రెండు పార్టీలను నడిపించడానికి సిద్దపడుతున్నారు. మరి దాని వలన వారి దోస్తీ మళ్ళీ కటీఫ్ అయినట్లయితే పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయేమో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close