చంద్రబాబు మిషన్ మాయావతి..! చలో ఢిల్లీ..!

టీడీపీ అధినేత చంద్రబాబు.. జాతీయ రాజకీయాలపై.. పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఎన్నికల తర్వాత బీజేపీ వైపు వెళ్తారని ప్రచారం ఊపందుకుంటున్న… బీఎస్పీ అధినేత్రి మాయావతి విషయంలో… కాంగ్రెసేతర పార్టీలన్నీ ఆందోళనతో ఉన్నాయి. అందుకే… టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈసీ వద్ద నిరసన వ్యక్తం చేయడానికని చెప్పి ఢిల్లీ వెళ్తున్న ఆయన… అసలు పని మాత్రం.. విపక్ష పార్టీలన్నింటినీ మధ్య మరింత నమ్మకం పెంచడం. పక్క చూపులు చూస్తారని భావిస్తున్న వారి మనసులోకి అలాంటివి రానివ్వకుండా చేయడం.

ప్రధాని రేసులో ఉన్నానని.. బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. అయితే.. ఆమెకు ప్రధాని ఇవ్వకపోతే.. కాంగ్రెసేతర కూటమి ఉండే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీతో పాటు.. కాంగ్రెస్ పార్టీపైనా ఆమె విరుచుకుపడుతున్నారు. ఆమె గతంలో చేసిన రాజకీయాలు… ఇతర వ్యవహారాలను బట్టి చూస్తే… తనకు రాజకీయ అవసరం అయితే.. బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమన్న ప్రచారం .. చాలా కాలంగా జరుగుతోంది. కానీ ఈ విషయంలో మాయావతి ఎప్పుడూ బయటపడలేదు. ఏడో విడత పోలింగ్ ముగుస్తున్న సమయంలో… ఆమెను.. కాంగ్రెసేతర కూటమిలోనే ఉంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఆయన లక్నో వెళ్లి మాయావతితో సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విపక్షాల భేటీకి ఆహ్వానించే అవకాశం ఉంది.

మాయావతిని… 23వ తేదీన సమావేశానికి వచ్చేలా ఒప్పించగలిగితే… అదే చాలా పెద్ద విజయం అవుతుంది. అఖిలేష్ యాదవ్… బీఎస్పీతో.. పొత్తు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా.. మాయావతికి ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతివ్వాల్సి ఉంది. ఈక్రమంలో.. మాయావతి.. విపక్షాల భేటీకి వచ్చేందుకు అంగీకరిస్తే… అఖిలేష్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మమతా బెనర్జీ .. ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పకపోయినా.. ఆమె… బీజేపీతో చేస్తున్న ఫైట్ ను చూస్తే.. కచ్చితంగా హాజరువుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు.. 23వ తేదీ భేటీ కోసం.. అన్ని బీజేపీయేతర పార్టీలను.. రప్పించే బాధ్యతను తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close