మ‌హేష్ – ప‌ర‌శురామ్ క‌థ‌… శంక‌ర్ స్టైల్‌లో..?!

మ‌హ‌ర్షి త‌ర‌వాత మ‌హేష్‌బాబు సినిమా ఏమిట‌న్న‌ది ఫిక్స‌యిపోయింది. అనిల్ రావిపూడితో మ‌హేష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఆ త‌ర‌వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాపై ఓ క్లారిటీ వ‌చ్చింది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించబోతున్నాడు. ఇటీవ‌ల మ‌హేష్‌ని క‌లిసిన ప‌ర‌శురామ్ ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

ఈ క‌థ‌కు సంబంధించిన ఓ క్లూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కుంటున్న ఓ క‌ఠిన‌మైన స‌మ‌స్య చుట్టూ ఈ క‌థ సాగ‌బోతోంద‌ట‌. దానికి క‌మ‌ర్షియ‌ల్ ఎటిమెంట్స్ జోడించాడ‌ని టాక్‌. సాధార‌ణంగా శంక‌ర్ ఇలాంటి కాన్సెప్టుల‌లో క‌థ‌ని అల్లుకుంటాడు. ఈసారి ప‌ర‌శురామ్ అదే బాట‌లో వెళ్లి ఓ క‌థని రాసుకున్నాడ‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంచుకున్న క‌థ‌ల‌న్నీ లైట‌ర్ వే లో సాగిన‌వే. తొలిసారి.. ఓ పెద్ద కాన్వాస్‌లో క‌థ‌ని త‌యారు చేసుకున్నాడు. ఈమ‌ధ్య మ‌హేష్ కూడా ఈ త‌ర‌హా క‌థ‌ల‌పై మ‌క్కువ చూపిస్తున్నాడు. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షిలో అండ‌ర్ క‌రెంట్‌గా ఓ బ‌ల‌మైన పాయింట్ ఉంది. అనిల్ రావిపూడి సినిమా కోసం మాత్రం ట్రాకు మార్చి.. పూర్తి వినోదాత్మ‌క క‌థ‌లో క‌నిపించ‌బోతున్నాడు. ప‌ర‌శురామ్ సినిమా మాత్రం… శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి స్టైల్‌లోనే సాగుతుంద‌ని, కాక‌పోతే.. ఈసారి దేశం ఎదుర్కుంటున్న ఓ స‌మ‌స్య‌కి ఈ సినిమా అద్దం ప‌ట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close