బాబ్లీ కేసును వాయిదా వేసిన ధర్మాబాద్ కోర్టు!

బాబ్లీ వివాదానికి సంబంధించిన కేసులో రీకాల్ పిటీష‌న్ ను ధ‌ర్మాబాద్‌ కోర్టు విచార‌ణ‌కు అనుమ‌తించింది. తదుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 1కి వాయిదా వేసింది. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున న్యాయ‌వాది సుబ్బారావు కోర్టులో వాద‌న‌లు వినిపించారు. దాదాపు ప‌దేళ్ల కింద‌ట బాబ్లీ ప్రాజెక్టు స‌మీపంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుతో స‌హా కొంత‌మంది నేత‌లు ఆందోళన‌కు సంబంధించిన కేసు ఇది అనే సంగ‌తి తెలిసిందే. నిజానికి, దీన్ని ఒక చిన్న‌ కేసుగా టీడీపీ నేత‌లు చూస్తున్నారు. అయితే, కోర్టు ఈ కేసును ఇప్పుడు సీరియ‌స్ గానే తీసుకుందనే కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన అంద‌రి వివ‌రాలూ, బ‌యోడేటాలు, తాజా వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలంటూ పోలీసుల్ని కోర్టు ఆదేశించిట్టు స‌మాచారం.

ఎనిమిదేళ్ల కింద‌ట ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మ‌యంలో పోలీసులు హ‌డావుడిగా ఆతృత‌గా వ్య‌వ‌హ‌రించార‌నీ, నాడు కేసులు న‌మోదు చేస్తున్న సంద‌ర్భంలో వివ‌రాల‌ను స‌రిగా న‌మోదు చేయ‌లేద‌నీ అంటున్నారు! నిజానికి, బాబ్లీ ప్రాజెక్టు ముందు నిర‌స‌న జ‌రిగిన స‌మ‌యంలో హ‌డావుడి ఓ హెలీకాప్ట‌ర్ తీసుకొచ్చి, అక్క‌డి నుంచి చంద్ర‌బాబు నాయుడుని హైద‌రాబాద్ కి త‌ర‌లించారు. ఆ త‌రువాత‌, ఎలాంటి కేసూ లేద‌ని కూడా మొద‌ట్లో అన్నారు! అయితే, 2010 దాఖ‌లైన ఈ కేసు ఇప్పుడు తాజాగా తెర మీదికి వ‌చ్చింది.

అప్పుడు న‌మోదు చేసిన 16 మంది వివ‌రాల్లో చాలా త‌ప్పులు న‌మోదు చేశార‌ట‌! వీరిలో ఒక‌రి అడ్ర‌స్ వివ‌రాల‌తో రాష్ట్రంలో ఎక్క‌డా అలాంటి ప్రాంత‌మే లేద‌ట‌! వీరిలో మ‌రొక‌రి పేరు ఎవ్వ‌రికీ తెలీద‌ట‌! ఆయ‌న ఎవ‌రో తెలీదు, ఆయ‌న ఏ ప్రాంతానికి చెందిన‌వారో అనే వివ‌రాలు కూడా త‌ప్పుడుగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆంధ్రాకి చెందిన‌వారికి తెలంగాణ అడ్ర‌స్ లు, తెలంగాణ వారికి ఆంధ్రా అడ్ర‌స్ లు రాసి… ఒక‌రి ఇంటిపేర్ల‌తో మ‌రొక‌రు.. ఇలా అస్తవ్య‌స్తంగా వివ‌రాలు న‌మోదు చేశార‌ని అంటున్నారు. వివ‌రాలు ఇలా త‌ప్పుగా న‌మోదు చేసుకుని.. ఆయా చిరునామాల‌కు నోటీసులు పంపినా స్పందించ‌లేద‌ని త‌మ‌పై అభియోగాలు మోపితే ఎలా అని కూడా కొంద‌రు ప్ర‌శ్నించారు. దీంతో వీరి పూర్తి వివ‌రాల‌ను తీసుకోవాలంటూ కోర్టు ఇప్పుడు ఆదేశించింద‌ని చెబుతున్నారు. అంటే, కేసు న‌మోదు స‌మ‌యంలో దీన్ని ఒక చాలా చిన్న ఘ‌ట‌న‌గానే పోలీసులు భావించ‌డం వ‌ల్ల‌నే వివ‌రాల సేక‌ర‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌లేద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా, ఇన్నేళ్ల తరువాత ఈ కేసుకు ప్రాధాన్యత పెరగడం వెనక రాజకీయ కారణాలను కూడా కాదనలేమనే విమర్శలు ఇప్పటికే గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close