సలహాదారు పదవిని తిరస్కరించిన చాగంటి !

ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ సలహాదారు పదవిని తిరస్కరించారు. టీటీడీ ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్టు ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్టు తెలిపారు. తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసును చాగంటి సందర్శించారు. క్యాంప్ ఆఫీసు ను ఆనుకుని సీఎం సతీమణి భారతి నిర్వహిస్తున్న గోశాలను కూడా సందర్శించారు. చాలా బాగుందని కితాబిచ్చారు.

అయితే తాజాగా ఈ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు పదవులు అవసరం లేదని, టీటీడీకి ఎప్పుడు అవసరం వచ్చినా సహకరించేందుకు తాను ముందుంటానని చాగంటి స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను కలవడం అంటే.. సలహాదారు పదవిని అంగీకరించడమేనని చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా పదవిని తిరస్కరించారు. దీనికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. సలహాదారుల పదవుల విషయంలో హైకోర్టు లో విచారణ జరుగుతున్న సమయంలో కోర్టును ధిక్కరించేందుకా అన్నట్లుగా ఈ నియామకం చేయడం ఓ కారణం అంటున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు.. లక్షల జీతభత్యాలు ఇస్తున్నారని గొప్పలు చెప్పుకుంటున్నరు. ఈ ప్రచారం ఆయన కంట బడటంతో అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు. కారణం ఏదైనా సలహాదారు పదవిని తిరస్కరించడంతో పాటు.. ఇలాంటి పదవి విషయంలో ఆయన చెబుతున్న ఓ ప్రవచనంలో వ్యాఖ్యల వీడియో వైరల్ అవడం సంచలనంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close