పింక్ రీమేక్‌లో ఊహించ‌ని మార్పులు?

ప‌వ‌న్ కల్యాణ్ `పింక్‌` రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే బాలీవుడ్ `పింక్`ని మ‌న మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కులు చూసేశారు. క‌థైతే అంద‌రికీ తెలిసిందే. త‌మిళంలోనూ ఈ సినిమాని రీమేక్ చేశారు. ఇలాంట‌ప్పుడు `పింక్‌` తెలుగు రీమేక్‌ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డం క‌త్తిమీద సామే. అందుకే వేణు శ్రీ‌రామ్ ధైర్యంగా కొన్ని అడుగులు వేశాడు. క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు చేశాడ‌ని స‌మాచారం. ముఖ్యంగా ప‌వ‌న్ ఇమేజ్‌కి, క్రేజ్‌కీ త‌గ్గ‌ట్టుగా కొన్ని మార్పులు చేశాడ‌ట‌. ప‌వ‌న్‌ని అమితాబ్‌లో 80 ఏళ్ల ముస‌లివాడిగా చూపించ‌డం చెల్ల‌దు. కేవ‌లం ప‌వ‌న్‌ని కోర్టులో వాద‌న‌ల సీన్‌కి ప‌రిమితం చేయ‌డం కుద‌ర‌దు. అందుకే.. వీలున్న చోట ప‌వన్‌లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార్ట‌. మ‌రి ఈ మార్పులు ఎంత వ‌ర‌కూ న‌ప్పుతాయ‌న్న‌ది తెలీదు. మ‌రీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకుంటే, మాతృక‌లోని ఆత్మ దెబ్బ‌తినేప్ర‌మాదం ఉంది. అయితే దిల్‌రాజు… అంత రిస్కు చేయ‌డు. త‌న‌కు త‌న సినిమాని ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. పైగా ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఆ అవ‌కాశం ఇలా వ‌చ్చింది. ఇలాంట‌ప్పుడు ఇంకెన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడో క‌దా..? అందుకే స్క్రిప్టు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా, మార్పులు చేర్పులు మ‌రీ గీత దాట‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. మ‌రి అంతిమ ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close