నందమూరి బాలకృష్ణ ప్రజలకు ముఖ్యమైన గమనిక జారీ చేశారు. “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్”పేరుతో ప్రజలుని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి తన పేరు, బసవతారకం హాస్పిటల్ పేరు వినియోగిస్తూ, అనుమతి లేని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
“బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు’ అని స్పష్టత ఇచ్చారు బాలయ్య.