సైరాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. అనుష్క కూడా… కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. ఝాన్సీ లక్ష్మీబాయ్గా కనిపించింది. సైరా సినిమాని ఆ పాత్రతోనే ప్రారంభిస్తారు. ఆ పాత్రతోనే ముగిస్తారు. `సైరా` టీమ్ లో భాగమైన ఈ ఇద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోకుండా నటించారు. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా వెల్లడించారు.
అమితాబ్ని నటించమని అడగ్గానే ఆయన ఒప్పుకున్నారని, సొంత విమానంలో షూటింగ్కి వచ్చారని, హోటెల్ డబ్బులు కూడా ఆయనే కట్టుకున్నారని ఇది వరకే చెప్పారు చిరు. ఇప్పుడు `సైరా` థ్యాంక్స్ మీట్లో ఆ విషయాన్నే గుర్తు చేసుకున్నారు. పారితోషికం గురించి ప్రస్తావించినా `ఇది నా స్నేహితుడి కోసం చేస్తున్న సినిమా.. మీకు భారం అవ్వకూడదు. ఆ తృప్తి నాకు మిగల్చండి` అంటూ సున్నితంగా తిరస్కరించారట. అనుష్క కూడా రూపాయి కూడా తీసుకోకుండా నటించిందని, వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు చిరు.