మరోసారి కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున..!

చిరంజీవి, నాగార్జు నేతృత్వంలో సినీ ప్రముఖులు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. కొద్ది రోజుల కిందటే… హైదరాబాద్ వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ కోసం.. తాము ప్రకటించిన విరాళాల చెక్కులను ఇచ్చేందుకు నాగార్జున, చిరంజీవి కేసీఆర్‌ను కలిశారు. ఆ తర్వాత రెండు రోజులకు చిరంజీవికి కరోనా వచ్చిందని రిపోర్ట్ రావడం.. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఫాల్స్‌దని తేలడం వంటివి జరిగాయి. మళ్లీ ఇప్పుడు.. ఆదివారం అయినప్పటికీ.. కేసీఆర్ సినీ ప్రముఖులకు సమయం ఇచ్చారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నారాయణ్‌దాస్‌, కేఎల్‌ దామోదర్‌, సి.కల్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వంటి వారందరూ కేసీఆర్‌ను కలిశారు.

సినీ పరిశ్రమ కష్టాలను కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడం.. థియేటర్లు మూసివేయడం వల్ల కార్మికులు నష్టపోయారని.. ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్‌లో పెద్ద సినీ పరిశ్రమ ఉందని .. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో సినీ పరిశ్రమ అంశాలను ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే చిరంజీవి నివాసంలో సమావేశమై సినీ పరిశ్రమకు ఏమేమి కావాలో చర్చించి.. చెప్పాలన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో టాలీవుడ్‌లోని కొంత మంది యాక్టివ్ అవుతున్నారు.

టీఆర్ఎస్‌కు సపోర్ట్ అన్నట్లుగా నేరుగా చెప్పకుండా… భేటీల ద్వారా.. తమ సంకేతాలు పంపుతున్నారు. నిన్నటికి నిన్న యాంకర్ సుమ కేటీఆర్‌తో భేటీ అయి పొగడ్తల వర్షం కురిపించగా.. పోసాని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి… తన బాధ్యత నెరవేర్చారు. ఇప్పుడు అగ్రహీరోలు..నేరుగా కేసీఆర్ ను కలిశారు. ఇక ముందు ముందు మరికొంత మంది తెర మీదకు వచ్చే అవకాశం ఉందిని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close