ప‌దిమంది ద‌ర్శ‌కుల‌తో చిరు డైలామా

మెగాస్టార్‌ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మార్పు క‌నిపించింది. ఇది వ‌ర‌క‌టి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. యువ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తున్నారు. ఓ ద‌శ‌లో చిరు మూడు సినిమాలు (గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌, వాల్తేరు వీర‌య్య‌) ఒకేసారి సెట్స్‌పై ఉన్నాయి. చిరు కెరీర్‌లో ఇలా జ‌ర‌గ‌డం చాలా అరుదు. ఈ స్పీడ్ చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. చిరంజీవి లాంటి ఓ అగ్ర క‌థానాయ‌కుడు… యువ‌త‌రంతో పోటీ ప‌డి సినిమాలు చేయ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ చిరు ఆచి తూచి అడుగులేయ‌డం క‌నిపిస్తోంది. ‘భోళా శంక‌ర్‌’ ఫ్లాప్ తో చిరు మ‌ళ్లీ అల‌ర్ట్ అయ్యారు. ఆయ‌న చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అదే… ‘విశ్వంభ‌ర‌’. ఈ సినిమా త‌ర‌వాత చిరు ప్రాజెక్ట్ ఏమిట‌న్న సందిగ్థం నెల‌కొంది. అయితే చిరు చుట్టూ దాదాపు ప‌దిమంది ద‌ర్శ‌కులు క‌థ‌లో రెడీగా ఉన్నారు. నిర్మాత‌లు అడ్వాన్సులు ఇవ్వ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ చిరు ‘డైలామా’ మాత్రం వ‌ద‌ల‌డం లేదు.

హ‌రీశ్ శంక‌ర్‌, అనిల్ రావిపూడి, మారుతి, త‌మిళ ద‌ర్శ‌కుడు హ‌రి, క‌ల్యాణ్ కృష్ణ‌, న‌క్కిన త్రినాథ‌రావు, అనుదీప్‌… ఇలా చిరు కోసం క‌థ‌లు సిద్ధం చేసుకొన్న ద‌ర్శ‌కుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ పోతోంది. బోయ‌పాటి శ్రీ‌ను, త్రివిక్ర‌మ్ వీళ్లు కూడా చిరుతో ఓ సినిమా చేయాల‌ని అనుకొంటున్నారు. కానీ… క‌థ‌లు ఫిక్స‌వ్వ‌డం లేదు. నిజానికి ‘విశ్వంభ‌ర‌’తో పాటు స‌మాంత‌రంగా ఓ సినిమా మొద‌లెట్టాల‌ని చిరు అనుకొన్నారు. కానీ ఆ ప్ర‌తిపాద‌న ప‌క్క‌న పెట్టారు. ‘విశ్వంభ‌ర‌’ ప‌నులు ఓ కొలిక్కి వ‌చ్చేంత వ‌ర‌కూ మ‌రో సినిమా మొద‌లెట్ట‌కూడ‌ద‌ని చిరు భావిస్తున్నారు. అందుకే క‌థ‌ల‌తో ద‌ర్శ‌కులు రెడీగా ఉన్నా చిరు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. పైగా.. క‌థ పూర్తి స్థాయిలో న‌చ్చితే త‌ప్ప గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు. అన్నింటికి మించి ఉరుకులు ప‌రుగుల మీద సినిమాలు చేసేయ‌డం కూడా చిరుకి ఇష్టం లేదు. ఆ అవ‌స‌రం రాలేదు. ఈ ప‌దిమందిలో ఎవ‌రి క‌థ ఎంచుకోవాల‌న్న డైలామా మాత్రం చిరుకి ఉంది. అన్నివిధాలా ప‌ర్‌ఫెక్ట్ అనుకొన్న త‌ర‌వాతే ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించాల‌ని చిరు ఓ నియ‌మంగా పెట్టుకొన్నారు. అందుకే త‌దుప‌రి సినిమా విష‌యంలో ఇంత ఆల‌స్యం జ‌రుగుతోంది. అయితే ఈ క్యూ మాత్రం ఆగ‌డం లేదు. రోజుకో ద‌ర్శ‌కుడి పేరు వెలుగులోకి వ‌స్తోంది. ఈ లిస్ట్ ఎంత వ‌ర‌కూ పెరుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close