మ‌హేష్ బాబు పారితోషికాన్ని చిరంజీవి దాటుతారా ?

టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానం ఎవ‌రిదంటే.. ఇప్ప‌టికీ చిరంజీవి పేరు చెప్పాల్సిందే. తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చినా – వంద కోట్ల సినిమాతో త‌న స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు చిరు. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నీ చిరు ఎంట్రీతో కుదేలైపోయాయి. ఆ త‌ర‌వాత‌… ఆ రికార్డులు మహేష్ చెరిపేశాడు. అది వేరే సంగ‌తి. `సైరా`తో మ‌ళ్లీ తెలుగునాట కొత్త చ‌రిత్ర సృష్టించాడు చిరు. అలా… మ‌హేష్ – చిరు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కుంది.

అయితే పారితోషికం విష‌యంలో మ‌హేష్ కాస్త ముందున్నాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాకి గానూ మ‌హేష్ అందుకున్న పారితోషికం చ‌ర్చ‌ల్లో నిలిచింది. ఈ సినిమాకి మ‌హేష్ 53 కోట్లు తీసుకున్నాడ‌ని టాక్ వినిపించింది. అదే నిజ‌మైతే…. ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయ‌కుల‌లో మ‌హేష్ ఒక‌డిగా నిలిచిపోతాడు. టాలీవుడ్‌లో అయితే త‌నే నెంబ‌ర్ వ‌న్‌. ఖైదీ నెంబర్ 150 స‌మ‌యంలో చిరు పారితోషికం ఎంత‌న్నది బ‌య‌ట‌కు రాలేదు. ఎందుకంటే అది సొంత సినిమా కాబ‌ట్టి. సైరాకీ ఇదే ప‌రిస్థితి. ఇప్పుడు కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమా విష‌యంలోనూ పారితోషికం అధికారికంగా తెలియ‌క‌పోవొచ్చు. ఎందుకంటే ఇందులో రామ్ చ‌ర‌ణ్ వాటా కూడా ఉంది. చిరు పారితోషికాన్ని.. చ‌ర‌ణ్ త‌న వాటాగా పెట్టిన‌ట్టు స‌మాచారం. సో.. చిరు పారితోషికం ఎంత‌న్న‌ది లోపాయికారి వ్య‌వ‌హార‌మే. అయితే.. చిరు మాత్రం మ‌హేష్ పారితోషికాన్ని బీట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. త‌న 153వ సినిమాకి మ‌హేష్‌ని క్రాస్ చేసి పారితోషికం అందుకోవాల‌న్న‌ది ప్ర‌స్తుత టార్గెట్‌. 153వ సినిమాకి త్రివిక్ర‌మ్ లేదా, బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కులుగా ఎంచుకునే ఛాన్సుంది. నిర్మాత ఎవ‌ర‌న్న‌ది తెలిస్తే చిరు పారితోషికం ప‌క్కా అవుతుంది. 153వ సినిమా నిర్మాణ బాధ్య‌త‌ల‌కు చ‌ర‌ణ్ దూరం అయితేనే.. చిరు కోరిక తీరుతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close