చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

‘ఆచార్య‌’ త‌ర‌వాత‌… ‘వేదాళం’ రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో ‘వేదాళం’ సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం` షూటింగ్ మొద‌లైపోయింద‌ని, కొన్ని మాంటేజ్ షాట్లూ ఈ సినిమా కోసం తీసేశార‌ని టాక్‌. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. అక్క‌డ ద‌స‌రా బ్ర‌హ్మాండంగా జ‌రుగుతుంది. ఆ నేప‌థ్యంలో చిత్ర‌బృందానికి కొన్ని మాంటేజ్ షాట్లు కావాల్సివ‌చ్చాయి.

అందుకే ఇటీవ‌ల ద‌స‌రా సంద‌ర్భంగా.. చిత్ర‌బృందం కొల‌కొత్తా వెళ్లి, అక్క‌డి ఉత్సవాల‌ను షూట్ చేసి వ‌చ్చింద‌ట‌. ఆ ఫుటేజీని.. `వేదాళం` రీమేక్‌లో వాడుకోబోతున్నారు. ఆ ర‌కంగా… `వేదాళం` రీమేక్ మొద‌లైపోయిన‌ట్టే. 2021 ద‌స‌రా లోపు ఈ సినిమాని పూర్తి చేయాల‌ని భావిస్తున్నార్ట‌. అందుకే ఇప్పుడే ఆ ఉత్స‌వాల్ని క‌వ‌ర్ చేసి, ముందు జాగ్ర‌త్త‌గా దాచి పెట్టుకున్నారు. ఈ సినిమాలో చిరు గుండు గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో చిరు గుండుతో లుక్ టెస్ట్ కూడా చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. చిరు చెల్లాయి పాత్ర‌లో కీర్తి సురేష్ దాదాపు ఖాయ‌మైంది. మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close