ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారాలన్నీ మూసేసుకోవాల్సిందే !

మార్గదర్శిపై పగతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారాలకు గండం వచ్చి పడింది. చిట్ ఫండ్ వ్యాపారంలో పక్కాగా నిబంధనలు పాటించే సంస్థ ఏది అంటే… అందరూ మార్గదర్శినే చెబుతారు. ప్రజల డబ్బుతో ముడిపడిన వ్యవహారం కావడంతో ఆ సంస్థ ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. అయితే చిట్ ఫండ్ నిబంధనలు అమలు చేయడం.. సాధారణసంస్థలకు సాధ్యం కాదు. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ఆ సంస్థల్లో చిట్ ఉల్లంఘనలు లెక్కలేనన్ని ఉంటాయి . వాటిల్లో మార్గదర్శి తరహాలో సోదాలు చేస్తే.. దాదాపుగా అన్ని కంపెనీలు మూతపడిపోతాయి.

మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ వంటిపెద్ద సంస్థలతో పాటు చాలా వరకూ నాలుగైదు బ్రాంచీలతో… కొంతమందిలో పలుకుబడి తెచ్చుకుని చిట్స్ నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి. అయితే ఏవీ కూడా నిబంధనల అమలులో మార్గదర్శి స్టాండర్డ్స్ అందుకోలేదని… ఆయా సంస్థల సేవలు అందుకున్న వారు చెబుతూ ఉంటారు. వారు నిబంధనలు కూడా పాటించరని… చిట్ పాడుకున్న తర్వాత అన్ని ష్యూరిటీలు సమర్పించిన తర్వాత చెక్ ఎప్పటికి వస్తుందో చెప్పలేరన్న అభిప్రాయం ఉంది.

ఇప్పటికి టార్గెట్ మార్గదర్శినే కాబట్టి ప్రభుత్వం ఆ సంస్థను టార్గెట్ చేసుకుంది. కానీ మార్గదర్శి విషయంలో చేసిన అతి…. రూల్స్ అమలుపై చేసిన కుట్రల వల్ల ఇతర చిట్ ఫండ్ సంస్థలు కూడా వణికిపోతున్నారు. ఇప్పటిక వారిపై వివిధ శాఖల నుంచి ఒత్తిడి పెరుగుోతంది. అధికార పార్టీల నాయకులు… దందాలకు దిగుతున్నారని చందాలు ఇవ్వాలని… లేకపోతే దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు కాకపోతే… ఆ చిట్ ఫండ్ నిరవాహకులు బెదిరిపోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం తో ఎప్పటికైనా సమస్య వస్తుందని అవసరమా అనుకునే పరిస్థితికి వస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త చిట్స్ విషయంలో పునరాలోచన చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close