పుల్లారావు, నారాయణపై అమరావతి భూముల కొనుగోళ్ల అక్రమాల కేసులు..!

అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ కేసులు నమోదు చేసింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారు .. పెద్ద మొత్తంలోభూములు కొనుగోలు చేశారని.. సీఐడీ కేసులు నమోదు చేశింది. మొత్తం 796 తెల్ల రేషన్‌ కార్డుదారులపై కేసు నమోదు చేశారు. ఎకరం రూ. రూ.3కోట్ల చొప్పున 300 కోట్ల విలువైన భూములు.. కొనుగోళ్లు చేసినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. తెల్ల రేషన్ కార్డు దారులకు అంత ఆదాయం లేదని.. వారు బినామీలని.. సీఐడి అనుమానిస్తోంది. అసలు కొనుగోలుదారులు ఎవరనేదానిపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. పెదకాకానిలో 43 మంది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు 40 ఎకరాలు, తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు కొన్నట్టు సీఐడీ అధికారులు ప్రకటించారు.

ఈ కొనుగోళ్లలో హస్తం ఉందంటూ.. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, మార్కెట్ మాజీ చైర్మన్‌ బెల్లంకొండ నరసింహారావుపై కేసులు నమోదు చేశారు. మభ్యపెట్టి తన భూమి కొన్నారని.. వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు చేసినట్లుగా..సీఐడీ అధికారులుచెబుతున్నారు. తెల్లరేషన్ కార్డు దారులతో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తున్నామని.. విచారణ వేగవంతం చేస్తామని.. సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రకటించారు. ఏపీలో.. పధ్నాలుగు లక్షల కుటుంబాలు ఉంటే.. పదిహేను లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం.. ప్రతీ కుటుంబం.. వైట్ కార్డు తీసుకుంది. ఇప్పుడు ఇలా.. వైట్ కార్డు ఉన్న వారు భూములు కొనడమే తప్పన్నట్లుగా కేసు పెట్టారు.

ఏ కోణంలో.. ప్రత్తిపాటి, నారాయణపై కేసులు పెట్టారో సీఐడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రత్తిపాటి మాత్రం.. రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారుని .. అక్రమ కేసులు పెట్టే అధికారులను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. అమరావతి భూములపై ఎన్నో ఆరోపణలు చేసిన వైసీపీ.. చివరికి.. మభ్య పెట్టి కొనుగోలు చేశారని… వైట్ రేషన్ కార్డులు ఉన్నా కొనుగోలు చేశారని..కేసులు పెట్టారు. ఇది ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే… !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close