వచ్చే ఏడాది నుంచి జూన్‌లో అమ్మ ఒడి !?

విద్యార్థుల హాజరుకు అమ్మఒడిని అనుసంధానం చేసి .. స్కూళ్లు ప్రారంభమైనప్పుడే విద్యార్థులకు పథకాన్ని అందించాలని సీఎం అధికారులకు సూచించారు. సోమవారం విద్యా శాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలను బడికి రప్పించాలన్న స్పూర్తితోనే అమ్మఒడి ప్రారంభించామని.. విద్యార్థుల హాజరును పరిగణనలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాలన్నారు. అకడమిక్‌ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జనవరిలో అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు. జనవరి తొమ్మిదో తేదీన తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేస్తున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక జూన్ నంచి అమలు చేసే అవకాశం ఉందని అంచనా వేయవచ్చు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు.

సీఎం జగన్ గతంలో ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జనవరిలో అమలు చేయాల్సి ఉంది. మరో వైపు ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద రూ. లక్ష కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు ఇతర ఖర్చులు వస్తే వాటితో చేసుకుంటారన్నారు. దీనిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close