చైతన్య : చీప్ మినిస్టర్

చిల్లర దొంగగా ఉన్నప్పుడు చేసే పనులకు.. గజ దొంగగా మారినప్పుడు చేసే పనులకు చాలా తేడాలు ఉంటాయి. చిల్లర దొంగగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఎంత రచ్చ అయినా చేస్తాడు. దొరికిపోతే ఏమీ దాచుకోడు అలా వెళ్లిపోతాడు. అప్పుడు అది అతని స్థాయి. ఓ హోదా గల దొంగగా మారినప్పుడు.. కాస్త డిగ్నిఫైడ్‌గా ఉంటాడు. ముఖం దాుచకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందకంటే..అది అతని హోదా పెరిగిందన్నమాట. హోదా పెరిగితే కాస్త గౌరవంగా వ్యవహరించడం నేర్చుకున్నాడన్నమాట. ఇలాంటి మార్పు అన్ని రకాల జీవుల్లోనూ వస్తుంది. హోదా పెరిగే కొద్దీ హుందాతనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది మాత్రమే భిన్నంగా ఉంటారు. అలాంటి వారు రాజకీయాల్లో ఎక్కువగా ఉంటున్నారు.

జగన్ రెడ్డికి ఆ మాటలు మామూలే.. కానీ సీఎం హోదాలో అనొచ్చా ?

జగన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలన్నారు. అనిపించారు. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు.. మంత్రులు అలా అనలేకపోయారు. ఎందుకంటే వారు ప్రజలిచ్చిన పదవులు అనుభవిస్తున్నారు. బాధ్యతల్లో ఉన్నారు. ఒక వేళ పదవులు లేకపోయినా అని ఉండేవారు కాదు. ఎందుకంటే మొదట వారు సమాజంలో గౌరవనీయమైన మనుషులు. వారు ఎలాంటి మాటలు మాట్లాడాలో.. ఎలాంటి మాటలు మాట్లాడకూడదో.. సమాజంలో మనకు ఎలాంటి గౌరవం వస్తుందో వారికి తలెుసు. కానీ సీఎం హోదాలో ఉన్న జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు.

ప్రజాధనంతో సభలు పెట్టి బూతులు మాట్లాడటం చీప్.. వెరీ చీప్

ప్రజాధనంతో సభలు పెట్టడం.. ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టడం అనే ఆలోచనే మరీ చీప్ గా ఉంది. పార్టీ సభల్లో తిడితే.. పార్టీ సమావేశాల్లో కంట్రోల్ తప్పి పోయారనుకోవచ్చు. కానీ ఆయన పెట్టింది ప్రభుత్వ సమావేశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐ ప్యాక్‌ చెప్పినట్లుగా చేస్తూంటారు. చూసి చదవడాన్నిబట్టి అది ఆయన ప్లాన్డ్ గా ఎంచుకున్న లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ రాజకీయాల్లో రాజకీయ విమర్శలు అనే దానికి కొత్త అర్థాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నేతలు .. విపక్ష నేతల్ని అసభ్యంగా దూషించడమే రాజకీయ విమర్శలు అయిపోయారు. ఇతర పార్టీల మహిళా నేతలు అయితే తమపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలపై కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. ఇది ఉన్నతంగా ఉంటుందా ?

ప్రతిపక్షాల్ని తిడితే ప్రజలు సంతోషిస్తారనుకునే మనస్థత్వం దేనికి సంకేతం

ఇలా ప్రతిపక్ష నేతల్ని తిట్టడం వల్ల తమ పార్టీని అభిమానించేవారి నుంచి మద్దతు లభిస్తుందని వైసీపీ అగ్రనేతలు అంచనాకు వచ్చారు. తమను అభిమానించే వారు విపక్ష నేతలపై వ్యతిరేకతతో ఉంటారని వారిని ఎంత ఎక్కువగా తిడితే తమపై అంత అభిమానం పెరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు. కానీ ఫలితాలను తేల్చేది మాత్రం న్యూట్రల్ ఓటర్లే. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఒక్కో సారి ఓటు బ్యాంక్ ఓటర్లు కూడా షాక్ ఇస్తారు. దానికి కారణం పరిపాలన సరిగా లేకపోవడం..అనుకున్నంతగా లబ్ది పొందలేదని బాధపడటం వంటివి. అలాగే చదువుకున్న వారు.. ప్రశాంతంగా జీవనం సాగాలనుకునేవారు.. పాలకుల నుంచి విపరీత ధోరణులను ఎక్స్ పెక్ట్ చేయరు. అందుకే మన సీఎం చీప్ మినిస్టరా.. చీఫ్ మినిస్టరా అన్నది వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తేల్చాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close