మంత్రుల్ని మార్చడానికి భయపడుతున్న సీఎం జగన్ !

గత ఏడాది సెప్టెంబర్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని .. ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన ఖాయమని లీకులు ఇచ్చారు. ముగ్గురు మంత్రులు అంటూ.. ఐదారుగురు పేర్లు బయటకు వచ్చాయి. జోరుగా ప్రచారం జరిగింది కానీ.. తర్వాత మార్చలేదు.

నవంబర్, డిసెంబర్, సంక్రాంతి అంటూ ప్రచారం చేశారు. తర్వాత మర్చిపోయారు. ప్రస్తుత మంత్రివర్గం అయితే కళంకితులు.. లేకపోతే అసమర్థులు అన్నట్లుగా చీలిపోయింది. ఈ కేబినెట్ తోనే జగన్ ఎన్నికలకు వెళ్తారా అని అప్పట్లోనే వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోయింది. కొంత మందిని తీసేసి.. సామాజికవర్గాల సమీకరణాల ప్రకారమూ మరికొంత మందికి చాన్సిస్తామని చెప్పుకున్నారు. కేబినెట్‌లోకి ఎవరెవరు అనే చర్చ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.

పగ్గాలు చేపట్టిన మూడేళ్ల తర్వాత కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు తీసుకుని కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. అయితే అందులో పదకొండు మంది పాతవారికే అవకాశం కల్పించారు. అవకాశం లభించని వాళ్లని పేర్ని నాని, కొడాలి నాని లాంటి నోరున్న నేతలున్నారు. వారి ప్లేస్‌లో వమంత్రి పదవులు చేపట్టిన వారు సైలెంట్‌గా ఉంటున్నారు. పదవులు పీకేసినా వారే నోటికి పని చెప్పాల్సి వస్తోంది. మంత్రుల్లో గట్టి వాయిస్ ఉన్న వారు లేరు. అయితే ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలిస్తే లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లేనని సీఎం జగన్ అనుకుంటున్నారు. అందుకే మంత్రివర్గ మార్పు అనే మాటే తన నోటి వెంట రానివ్వడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close