ఫిరాయింపు ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చిన జగన్ !

ఫిరాయింపు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకున్న తర్వాత తనను దూరం పెట్టడం.. తనకు వ్యతిరేకంగా ఇతరుల్ని ప్రోత్సహించడం.. బలాన్ని నిరూపించుకోవాలని కొత్త ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి అవమానించడంతో ఇటీవల ఆయన తాను నియోజకవర్గ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లుగా లేఖ రాశారు. ఆ తర్వాత జగన్ చెప్పారని చెప్పి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆయన ఇంటికి జగన్ వెళ్లారు.

విశాఖలో పరిశ్రమల శంకుస్థాపనల కోసం వచ్చిన జగన్.. ఆ తర్వాత వాసుపల్లి ఇంటికి వెళ్లారు. దీంతో ఆయనకు కాస్త భరోసా ఇచ్చినట్లయింది. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా లేకపోతే.. మొత్తానికే మోసపోతానా అని కంగారు పడుతున్న వాసుపల్లికి.. జగన్ .. భరోసా ఇచ్చినట్లయింది. జగన్ వాసుపల్లి ఇంటికే వెళ్లడంతో ఆయనకు టిక్కెట్ ఖరారయినట్లేనని.. నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారంతా ఇక సర్దుకోవచ్చని ప్రచారం ప్రారంభించారు.

అయితే విశాఖ జిల్లాలో పార్టీని నమ్ముకుని చాలా మంది ఉన్నప్పటికీ వారెవరినీ పట్టించుకోకుండా.. ఫిరాయింపు ఎమ్మెల్యేను బుజ్జగించడానికి జగన్ ప్రయత్నించడం.. మిగిలిన నేతలకు పెద్దగా రుచించలేదు. అయితే ఎవరూ నోరెత్తలేని పరిస్థితి. ఇప్పుడు వాసుపల్లి.. విశాఖ ఇంచార్జ్‌గా ఉన్న వైవవీ సుబ్బారెడ్డిని కూడా లెక్క చేయకుండా.. తన పని తాను చేసుకోవచ్చని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close