గ్రేటర్ ఎన్నికలలో కేసీఆర్ ఈ-ప్రచారం!

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా బహిరంగ సభల ద్వారానే ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. కానీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఆయన ఆధునిక పద్దతిలో ఈ-ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం నగరంలో తిరగడం మొదలుపెడితే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఈ పద్దతిలో వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో ఒక్కోసారి నగరంలో పన్నెండు డివిజన్ల చొప్పున మొత్తం 150 డివిజన్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడుతారు. అదే సమయంలో ఆయన ప్రజలనుద్దేశ్యించి ప్రసంగాలు కూడా చేస్తారు. ఆయా డివిజన్లలో బారీ స్క్రీన్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడాటానికి అవసరమయిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి చాలా శ్రమ, ఖర్చుతో కూడుకొన్నపని. కానీ ఈ-ప్రచారానికి అంత శ్రమ, ఖర్చు కూడా అవదు. పైగా ప్రత్యేకంగా ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయనవసరం లేదు. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతం అయినట్లయితే, పార్టీలోని మిగిలిన ముఖ్యనేతలు అందరూ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది.

ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ ఇంతవరకు అమలుచేయడం లేదు కనుకనే ప్రజలకు వద్దకు వచ్చేందుకు వెనుకాడుతున్నారని అందుకే తన కొడుకు కె.టి.ఆర్., కుమార్తె కవిత తదితర నేతలను ప్రచారానికి పంపిస్తున్నారని తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలలో రాజకీయ నేతలు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించినట్లయితే ఆ ప్రభావం ప్రజలపై బాగా ఉంటుంది. వాటితో ప్రజలను ఆకట్టుకొన్నట్లుగా ఈ- ప్రచారం ద్వారా ఆకట్టుకోవడం కష్టం. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యలో రెండు మూడు బహిరంగ సభలు కూడా నిర్వహించాలనుకొంటున్నారు. ఒకవేళ అయన కేవలం ఈ-ప్రచారానికే పరిమితమయితే అది ప్రతిపక్షాలకి చాలా ఉపయోగపడవచ్చును. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడానికి మంచి అవకాశం కూడా కల్పిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close