విశాఖలో సాఫ్ట్వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ క్యాంపస్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రూ. 1,583 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఈ క్యాంపస్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్కు కాపులుప్పాడలో 21.31 ఎకరాల స్థలం కేటాయించారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఇప్పటికే గూగుల్ , టీసీఎస్ వంటి సంస్థలను తమ క్యాంపస్లను పెట్టడానికి అంగీకరింపచేశారు.
కాగ్నిజెంట్ ను ఏపీకి తీసుకు రావడానికి నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేశారు. జనవరి 2025లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో నారా లోకేష్, కాగ్నిజెంట్ సీఈఓ ఎస్. రవి కుమార్ మధ్య జరిగిన చర్చలు జరిగాయి. ఆ చర్చల తర్వాత అధికారులు ఫాలో అప్ చేశారు. చివరికి కాగ్నిజెంట్.. పెట్టుబడికి రెడీ అయింది.
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇప్పటికే విశాఖలో భారీ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ముందుగానే కార్యాలయం ప్రారంభించేందుకు మిలీనియం టవర్స్ లో ఏర్పాట్లు చేసుకుంటోంది. గూగుల్ కూడా ఇప్పటికే క్యాంపస్ కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఎలాంటి క్యాంపస్ పెట్టబోతున్నారన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.