లాలూ కేసులతో జగన్ కేసులకు పోలిక..!

అక్రమాస్తుల కేసుల్లో తనపై నమోదైన కేసులన్నింటినీ.. ఒకే సారి విచారణ జరపాలంటూ వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మరోసారి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడేళ్లలో ఇలాంటి పిటిషన్లు వేస్తూ.. విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ వాదించింది. నేరాలన్నీ.. విడివిడిగా చేశారని.. నిందితుల్లో కామన్‌గా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ.. ఇతర నిందితులు మాత్రం వేరని స్పష్టం చేసింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేసుల్లోనూ.. విడివిడిగా విచారణ జరిపి… విడివిడిగానే శిక్షలు విధించిన సంగతిని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది.

ఏడేళ్లుగా… సీబీఐ కోర్టులో ప్రతీ శుక్రవారం విచారణ జరుగుతోంది. వాస్తవానికి తుది విచారణ మాత్రం ఇంత వరకూ ప్రారంభం కాలేదు. కేవలం.. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నిందితులు దాఖలు చేస్తున్న వివిధ రకాల పిటిషన్లపై విచారణ జరుపుతున్నారు. హైకోర్టులో కొన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిని కొన్నింటిని హైకోర్టు కూడా కొట్టి వేసింది. వాటిపై విచారణ ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో.. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి.. మళ్లీ కొత్తగా అన్ని కేసుల్ని కలిపి విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి… అవి తేలే వరకూ.. అసలు విచారణ ప్రారంభం కాకూడదని.. జగన్, విజయసాయిరెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ఈ వ్యవహారాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా సీబీఐ.. జగన్, విజయసాయిరెడ్డిల పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎలాంటి.. చిన్న మినహాయింపు ఇవ్వడానికి కూడా సిద్ధపడటం లేదు. వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో.. తీవ్రంగా వాదనలు వినిపించిన.. సీబీఐ.. ఇప్పుడు.. కొత్తగా వేసిన పిటిషన్‌పై.. మరింత ఘాటుగా జడ్జికి వాదనలు వినపించింది. విచారణ ఆలస్యం చేయడానికే.. ఇలా చేస్తున్నారని మండిపడింది. ఆర్థిక నేరాల కేసుల్లో.. త్వరగా విచారణ పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సీబీఐ.. కూడా.. అక్రమాస్తుల కేసును వీలైనంత త్వరగా తేల్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close