29వ తేదీ వరకే చంద్రబాబుకు షరతులు వర్తింపు

చంద్రబాబునాయుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అడడంకులు దాదాపుగా తొలగిపోయాయి. స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు .. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు పెట్టిన షరతులను 29వ తేదీ వరకే వర్తింప చేసింది. ఆ తర్వాత ఎటువంటి షరతులు ఉండవు. అంటే అప్పట్నుంచి చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ నెల ఇరవై ఎనిమిది లోపు చంద్రబాబు ఆరోగ్య నివేదికను ఏసీబీ కోర్టుకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

చంద్రబాబు భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో కర్నూలులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వచ్చింది.ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అందుకే చంద్రబాబు 29 నుంచి మళ్లీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

మరో వైపు చంద్రబాబును రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చేసేందుకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో.. బెయిల్ పై వచ్చిన సమయంలో కొత్తగా మద్యం, ఇసుక అంటూ కేసులు నమోదు చేశారు. వాటి ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. వాటిపై విచారణలు సాగుతున్నాయి. మరో వైపు 17ఏ కేసులో తీర్పు అనుకూలంగా వస్తే అసలు ఏ సమస్యా ఉండదు. చంద్రబాబుపై పెట్టినవన్నీ అక్రమ కేసులుగా తేలుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close