స్కిల్ కేసులో చంద్రబాబుకు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో చంద్రబాబుకు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే మెడికల్ గ్రౌండ్స్ పై ఆయన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు కావడంతో మధ్యంతర బెయిల్ షరతులు కూడా ఉనికిలో లేనట్లే.

స్కిల్ ప్రాజెక్టులో స్కాం అంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ 37గా ఉన్నారు. కేులో చివరి వ్యక్తి ఆయనే. ఈ కేసులో ఉన్న వారిలో అరెస్టు చేసిన వారు నెల రోజుల్లోనే బెయిల్ తెచ్చుకున్నారు. వారిపైనా ఎలాంటి సాక్ష్యాలను సీఐడీ చూపించలేకపోయింది. కానీ ఏ 37 అయిన చంద్రబాబును మాత్రం 52 రోజులు జైల్లో ఉంచారు ఇటీవల ఏ 35 నిందితుడికి.. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది.

కర్నూలులో రాజకీయ పర్యటనలో ఉన్న సమయమంలో రెండున్నర నెలల కిందట చంద్రబాబును అరెస్టు చేశారు. 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. కానీ చంద్రబాబు తప్పు చేశారని కనీస ఆధారాలను కోర్టులో సమర్పించలేకపోయారు. పదే పదే వాయిదాలు కోరుతూ కేసు విచారణ ఆలస్యమయ్యేలా చేశారు. ఇప్పటికీ.. చంద్రబాబుపై కొత్త కొత్త కథలు కోర్టుకు చెబుతూనే ఉన్నారు కానీ దేనికీ ఆధారాలు చూపించలేదు.

స్కిల్ కేసు మాత్రమే కాదు.. సీఐడీ తనపై నమోదు చేస్తున్న కేసులన్నీ చట్ట విరుద్ధమని … సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఈ వారంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు...

ఏపీ పోలీసులతో సాగర్ గేట్లు ఎత్తేయించి జగన్ రెడ్డి సాధించిందేంటి ?

తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.....

ప్రాసెస్‌లో క్వాష్ పిటిషన్‌పై తీర్పు : సుప్రీంకోర్టు ధర్మాసనం

చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు ప్రాసెస్ లో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై...

తెలంగాణ ఓటరు నిరాసక్తత

తెలంగాణ ఓటరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పెద్ద పెద్ద క్యూలైన్లు ఎక్కడా కనిపించడం లేదు. మధ్యాహ్నం ఒంటింగంట వరకూ పోలింగ్ పర్సంటేజీ కేవలం 37 శాతం వరకే ఉంది. 2018లో ఇది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close