ప్రముఖులకు కరోనా ..! ఏది నిజం..? ఏది అబద్దం..?

బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కరోనా సోకింది. అయితే ఆయన దాచి పెట్టుకోలేదు. ప్రజల ముందు పెట్టారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు మాత్రం… అందుకు మినహాయింపు అయినట్లుగా ఉంది. తమకు వస్తే ప్రజలు బాధపడతారని అనుకుంటున్నారో… లేకపోతే ప్రజల్లో భయాందోళనలు వస్తాయని అనుకుంటున్నారో కానీ.. సీక్రెట్‌గానే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆ నోటా.. ఈ నోటా బయటకు వస్తూనే ఉన్నాయి. కోస్తాలో ఓ ఎంపీకి… అలాగే రాయలసీమకు చెందిన ఓ డిప్యూటీ సీఎంకు కరోనా సోకిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని వారు బయట పెట్టలేదు. ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. ఆ డిప్యూటీ సీఎం.. స్వాగత కార్యక్రమంలో కనిపించలేదు. దాంతో.. అందరూ నిజమేనని నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి.

ఏపీలో పలువురు రాజకీయ నేతలు.. ఉన్నతాధికారులు కరోనా బారిన పడినట్లుగా కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. ప్రగతి భవన్‌లో ముఫ్పై మందికి కరోనా సోకడంతో.. కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కు వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ బయట కనిపించడం మానేశారు. దాంతో ఆయనకూ కరోనా సోకిందంటూ.. కొంత మంది ప్రచారం ప్రారంభించారు. ఓ చిన్న పత్రికలో అదే విషయం ప్రచురించడంతో.. పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. కేసీఆర్‌కు కరోనా సోకలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో… జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న నేరుగా కోర్టులో పిటిషన్ వేశారు. ప్రగతి భవన్‌లో 30 మందికి కరోనా సోకిన తర్వాత సీఎం కనిపించడం లేదని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన ఉందని.. పూర్తి సమాచారం బయటకు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోతే.. ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతాయి. పుకార్లు పెరిగిపోతాయి. అది.. లేని పోని వివాదాలకు కారణం అవుతుంది. ఏపీలో అయినా.. తెలంగాణలో అయినా.. కరోనా గురించి పూర్తి పారదర్శకత ఉంటేనే.. ప్రజలకు పూర్తి సమాచారం.. క్లారిటీ సమాచారం ఉంటేనే ప్రయోజనం. లేకపోతే.. ఇబ్బందికర పరిణామాలకు కారణం అవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close