రాయలసీమలో నల్గొండను ఎందుకు చేర్చినట్లు?

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం త్వరలో కాంగ్రెస్, వైకాపా నేతలు కలిసి ఉద్యమం ఆరభించబోతున్నట్లు వార్తలు వచ్చేయి. ఎందుకంటే రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందని చెపుతున్నారు. నిజమే. నేటికీ రాయలసీమ నిరాదరణకు గురవుతోంది. అయితే రాయలసీమ పరిస్థితిని చూసి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్న కాంగ్రెస్ నేతలు గత పదేళ్ళుగా తమ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? సీమ అభివృద్ధికి వారు ఏమి చేసారు? సీమలో ఒక్కో ప్రజా ప్రతినిధిని తమతమ నియోజక వర్గాల వారిగా ఏమేమి అభివృద్ధి కార్యక్యమాలు చేప్పట్టారు? వాటిలో ఎన్ని పూర్తి చేసారు? అసలు ఎన్నాడయినా అటువంటి ఆలోచన చేసారా లేదా? అనే ప్రశ్నలకు సీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్న కాంగ్రెస్ నేతలు జవాబులు చెప్పవలసి ఉంది.

చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, నల్గొండ ఏడు జిల్లాలతో కలిపి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్ అని వార్తలు వచ్చేయి. అదే నిజమయితే వారి పోరాటంలో చిత్తశుద్ధి లేదని ముందే రుజువు చేసుకొన్నట్లు భావించవచ్చును. ఎందుకంటే సుదీర్గ పోరాటాల తరువాత ఇటీవలే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణాలోని నల్గొండ జిల్లాను వేరు చేయడం సాధ్యమేనని అనుకొంటే అవివేకమే అవుతుంది. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేస్తే తెలంగాణా ప్రజలు, పార్టీలు దానిని తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. ఈ సంగతి సీమ కోసం ఉద్యమించడానికి సిద్దమవుతున్న హేమహేమీలకు తెలియదనుకోలేము. అయినా వారు నల్గొండను సీమలో కలపాలని అనుకొంటున్నట్లయితే, వారు సాధ్యం కాని అటువంటి డిమాండ్ తో సుదీర్ఘ కాలం పోరాటాలు కోనసాగించడం కోసమే నల్గొండను చేర్చినట్లు చెప్పకతప్పదు. తద్వారా ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ ప్రజల మధ్య మళ్ళీ చిచ్చురగిల్చి నట్లువుటుంది. అంటే వారు ప్రత్యేక రాష్ట్రం కోసం కాక తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ ఉద్యమానికి సిద్దం అవుతున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close