ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ వింత వాదన

హైదరాబాద్‌: ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లుంది కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ చింతా మోహన్ వాదన. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్రమంతా పార్టీలకతీతంగా గొడవ జరగటం, కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతూ ఉంటే తిరుపతికి చెందిన చింతా మోహన్ మాత్రం ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజి కావాలి అంటున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేకహోదా కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. అందుకే తమకు ప్రత్యేకహోదా వద్దని, ప్యాకేజియే కావాలని అన్నారు. చింతా ఇవాళ తిరుపతిలో కృష్ణదేవరాయ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమకు రు.57 వేల కోట్ల ప్యాకేజి ప్రకటించాలని, చిత్తూరుజిల్లాకు రు.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు ఆదాయపుపన్ను ఎగ్గొట్టేందుకే ప్రత్యేకహోదా అంటున్నారన్న వాదనకూడా నిజమే అయిఉండొచ్చు. చింతా మోహన్ వాదనను పూర్తిగా అసంబద్ధంగా కొట్టిపారేయలేము. దీనిపై కూడా చర్చ జరగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close