కేంద్రానికి ‘జిశాట్ 6’ హితవు!

భారత అంతరిక్షపరిశోధనా సంస్ధ (ఇస్రో) ని విభాగాలవారీగా, సర్వసుల వారీగా ప్రయివేటీకరించే ఆలోచనను మానుకోవాలని కూడా నాలుగు రోజులనాటి జిశాట్ 6 లేదా జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జిఎస్ఎల్ వి) డి6 విజయం కేంద్రప్రభుత్వానికి హితవు చెబుతోంది.

అంతరిక్షంలోకి సాంకేతిక ఉపగ్రహాలను పంపే మార్కెట్ లో భారతదేశం అమెరికాను అధిగమించి దూసుకుపోతోంది. ద్రవరూప, ఘనరూప ఇంధనాలతో రాకెట్లను అంతరిక్షంలోకి పంపే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్ వి) పంపడంలో ఇస్రో విజయవంతమౌతున్న స్ధితీ, భారత్ లో సొంత అణుపరీక్షలూ అమెరికా, యూరప్ లకు కన్నెర్రఅయ్యాయి. ఫలితంగా హెచ్చుబరువుని స్ధిరంగా తీసుకుపోగల ఇంధన సంబంధిత క్రయోజనిక్ పరిజ్ఞానాన్ని తెచ్చుకోవడంలో భారతదేశం మీద అంక్షలు వచ్చిపడ్డాయి. స్వంత క్రయోజనిక్‌ పరిజ్ఞానంతో రాకెట్‌ తయారీకి ఉపక్రమించిన భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు ఈ కృషిలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. పశ్చిమ దేశాలు మన దేశానికి ఆధునిక అంతరిక్ష పరిజ్ఞానం రాకుండా అడ్డుకున్నాయి. రష్యానుండి క్రయోజనిక్‌ రాకెట్ల దిగుమతి ఒప్పందం చేసుకుంటే 1991లో దానిపై ఒత్తిడి తెచ్చి ఒప్పందం నుండి వెనక్కు మళ్లేట్లు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు సొంత క్రయోజనిక్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఈ ఆంక్షలే దారి చూపించాయి. పిఎస్ ఎల్ వి రాకెట్లు టన్ను నుంచి టన్నున్నర బరువుగల ఉపగ్రహాలను మోసుకుపోయేవి. తాజాగా విజయవంతమైన సొంత క్రయోజనిక్ టెక్నాలజీ వల్ల జిశాట్ 6 – రెండు టన్నుల శాటిలైట్ ని అంతరిక్షంలో విడిచిపెట్టింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా మన దేశ సైనికావసరాల కోసమే అయినా కూడా, ట్రాన్స్ మిషన్ పరంగా ఎస్ బేండ్ కి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనలు తక్కువ ఖర్చతోనే ఉపగ్రహాలను పంపే విధానాలను ఖరారు చేశాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా, మన ఇస్రో దాదాపు ఒకే సమయంలో అంగారక గ్రహానికి శాటిలైట్లను పంపాయి. ఇందులో నాసా ‘మావెన్‌ ఆర్బిటర్‌’ కు ఖర్చు 67 కోట్ల డాలర్లయితే, ఇస్రో ‘మంగళయాన్ ‘ ఖర్చు కేవలం 7 కోట్ల డాలర్లే! మొదటినుంచీ కూడా ఇస్రో ఖర్చు తక్కువగా వుండటం వల్లే అనేక విదేశాలు ఇస్రోనుంచే శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతున్నాయి.

‘నాసా’ లో ప్రతీ పనీ, ప్రతీ సర్వీసూ, ప్రతీ సపోర్టింగ్ సర్వీసూ ప్రయివేటురంగమే చేస్తుంది. ఇందువల్లే వారి ఖర్చ తడిసిమోపెడు అవుతుంది. సర్వాస్వాన్నీ ప్రయివేటురంగానికే ఇచ్చేయాలన్న లిబరలైజ్డ్ విధానాన్ని శరవేగంతో అమలు చేస్తున్న కేంద్రప్రభుత్వం ఇస్రో ను కూడా నాసా మాదిరిగానే విభాగాలుగా విడిభాగాలుగా ప్రయివేటీకరించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

జిశాట్ 6 విజయమైనా కేంద్రం ఆలోచనల్ని మారుస్తుందని ఆశిద్దాం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close