కాంగ్రెస్, వైకాపాల మధ్య మంచి అవగాహనే కనబడుతోంది

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా పోరాటాలు సరిగ్గా ఎప్పటి నుండి ఉదృతం చేసారు అంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకి వచ్చి హెచ్చరించిన తరువాత నుండే అని చెప్పవచ్చును. అంతకు ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. “దాని గురించి పార్లమెంటులో మా ఎంపీలు పోరాడుతుంటే మళ్ళీ నేనెందుకు దాని గురించి మాట్లాడాలి…పోరాడాలి?” అని ఎదురు ప్రశ్నించేవారు కూడా. కానీ రాహుల్ గాంధీ హెచ్చరించిన తరువాత ఆయన డిల్లీ వెళ్లి ఐదు గంటలు ధర్నా చేయడం తరువాత రాష్ట్రంలో దాని గురించి బంద్, నిరాహార దీక్షలు వగైరా హడావుడి చేస్తూనే ఉన్నారు.

గమనించవలసిన ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఆయన ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలుపెట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాలని పూర్తిగా నిలిపివేసింది. అంతే కాదు అవసరమయితే జగన్ పోరాటాలకి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ మధ్యనే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అంటే రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకొనే పరిస్థితి కనబడకపోవడంతో ఏదో విధంగా వైకాపాకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.

జగన్మోహన్ రెడ్డి తొందరపాటుతోనో లేక చంద్రబాబు నాయుడుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగానో “రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రాను కనుక నన్ను పిలవద్దు” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బహుశః కాంగ్రెస్ పార్టీ ఆయనని ప్రసన్నం చేసుకోనేందుకేనేమో తాము కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించేసింది. మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ కార్యక్రమాన్ని ఒక రాష్ట్ర కార్యక్రమంలాగా కాకుండా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో కార్యక్రమమంలా నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ఆహ్వానించిన తీరు కూడా బాగోలేదు. అందుకే మేము ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకొన్నాము,’ అని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై వినిపిస్తున్న విమర్శలు చూసిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని అనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడం అలవాటే కానీ ఎంతో అనుభవం ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అదే విధంగా వ్యవహరించాలనుకోవడమే వింత. తాము ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపి, ఆయనకు దగరవ్వాలనునుకొంటున్నారేమో తెలియదు కానీ దాని వలన వారికి ప్రజలు ఇంకా దూరం అయ్యే అవకాశం ఉందని గ్రహిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close