ఏపీ రాజ్యాంగంలో వైసీపీ రాళ్ల దాడులూ నిరసనే !

ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజ్యాంగాన్ని పోలీసులు అద్భుతంగా అమలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ పై జరిగిన దాడిన నిరసనగా చెప్పుకొస్తున్నారు పోలీసులు. అంత స్పష్టంగా దాడులకు పాల్పడిన వీడియోలు ఉంటే స్వయంగా ఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. దాడి చేయాలన్న ఉద్దేశంతో కాదని… నిరసన తెలియచేయడానికే రాళ్లేశారని చెప్పుకొచ్చారు. గతంలో అమరావతిలో చంద్రబాబు కారుపై రాళ్ల దాడి చేస్తే… అప్పటి డీజీపీనే అది నిరసన అన్నారు. ఆయన వెళ్లిపోయినా పోలీసులు మాత్రం చట్టాన్ని ఎలా అమలు చేయాలో చక్కగా నేర్చుకున్నారు.

అయితే ఈ రాళ్ల దాడులు.. పార్టీ కార్యాలయాలపై దాడులు అన్నీ వైసీపీ నాయకులకు మాత్రమే ఉండే ప్రజాస్వామ్య స్వేచ్చ. అదే వైసీపీ నేతలలపై ఇతరులు ఎవరైనా ఖాళీ వాటర్ బాటిల్ విసిరినా అది హత్యా నేరమే. నిరసన అనే దానికి అక్కడ అర్థం ఉండదు. విజయనగరంలో ఇలా ఎవరో విజయసాయిరెడ్డి మీద వాటర్ బాటిల్ విసిరితే…. చంద్రబాబు మీద కేసు పెట్టేసే రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలవుతోంది. ఇక విశాఖలో రోజా మిడిల్ ఫింగర్ చూపించి రెచ్చగొడితే… జనసైనికులు చెప్పులు విసిరారు. కానీ కేసులు పెట్టింది మాత్రం హత్యయత్నం సెక్షన్లు. ఇలాంటి ఉదంతాలు చెప్పుకోవాలంటే… ఏపీ పోలీసుల సిన్సియార్టీ రెండు పుస్తకాలవుతుంది.

కానీ పోలీసులకు తెలియనిదేమిటంటే.. ప్రజల్లో తమను రక్షించే పోలీసులు బలహీనం అయ్యారని వారికి ఆ సామర్థ్యం లేదన్న ముద్రపడిపోతే మొత్తం అరాచకం ఏర్పడుతుంది. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. తన్నే వాడితే అధికారం అన్నట్లుగా తయారయింది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల నష్టం అధికార పార్టీకో… మరో నేతకో ఉండదు. పవిత్రమైన ఖాకీ యూనిఫాం పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన స్థాయిలో ఉండి.. విఫలమైతే ఆ ప్రభావం మొత్తంగా రాష్ట్రానికి ఉంటుంది. ఎప్పుడు తెలుసుకుంటారో మరి ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహానాడు : టీడీపీ 6 హామీలతో భవిష్యత్‌కు గ్యారంటీ !

మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షే్మ రంగంలో ఆరు హామీలు ప్రకటించింది. భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ...

ఎన్టీఆర్‌ను వైసీపీ స్మరించుకుంది.. చంద్రబాబును తిట్టడానికైనా సరే!

ఎన్టీఆర్ అందరి మనిషి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానేకొంత మందికి దూరంఅవుతారు. అలా దూరమైన వారు కూడా ప్రత్యేక సందర్భాల్లో దగ్గర చేసుకోక తప్పదు. ఎన్టీఆర్‌ను అలా దగ్గర చేసుకోవాల్సిన ప...

బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే...

అందరికీ బెంచ్ మార్క్ బిల్డింగ్‌లు – ఏపీ జనానికి మాత్రం బటన్లు !

తెలంగాణ ప్రభుత్వం ఓ పెద్ద సెక్రటేరియట్ కట్టుకుంది. కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ నిర్మించింది.. అంత కంటే ఎక్కువ కథలు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ రెండు నిర్మాణాలూ అవసరం లేదని..దుబారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close