ఆర్కే పలుకు : తెలుగు నేతలు ఇంత బలహీనులెందుకయ్యారు ?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తెలుగు ప్రజలు లోతుగా ఆలోచించాల్సిన అంశాలను వారి ముందు పెట్టారు. నేరుగా ఆయన ఏమీ చెప్పలేదు దేశంలో ఇంత జరుగుతూంటే… తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారన్న అంశాన్ని చాలా తెలివిగా తన ఆర్టికల్ ద్వారా ప్రజలకు వివరించారు. అందులో మొదటిది… ఏ మాత్రం సామర్థ్యం లేని నేతల్ని గెలిపించుకోవడం.. .. రెండు రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన సంఖ్యా బలహీనత.

జాతీయ రాజకీయాల్లో తెలుగువాడికి గతమెంతో ఘనకీర్తి ఉంది. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ దగ్గర్నుంచి కాంగ్రెస్‌ వ్యతిరేకంగా కొన్ని ఫ్రంట్‌లు అధికారం చేపట్టడంలో తెలుగువారి పాత్ర కీలకం. ఎన్టీఆర్, చంద్రబాబు చక్రం తిప్పేవారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అయినా ఇప్పుడు చంద్రబాబు కూడా నోరు తెరవడం లేదు. ఎందుకు తెరవడం లేదనే విషయం అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుంది. ముందు ఆ రాజకీయ జీవితాన్ని పొడిగించుకోవడానికి గెలిచే ప్రయత్నాలు చేయాలి . గత ఎన్నికల్లో బీజేపీపై ఆయన తీవ్రంగా పోరాడారు. దాని ఫలితంగానే ఘోర ఓటమి. ఆయనకు కొంత బలం జనం ఇచ్చి ఉన్నా ఆ పోరాటం కొనసాగించి ఉండేవారేమో ?

ఇక ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు పొందిన జగన్, కేసీఆర్ పూర్తి స్థాయిలో కేసుల భయంతో సైలెంట్ అయ్యారు. జగన్ అసలు నోరెత్తే ప్రయత్నమే చేయడం లేదు. రివర్స్ లో రాహుల్ గాంధీనే విమర్శిస్తున్నారు. ఇక కేసీఆర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బయటకు రాకుండా ప్రగతి భవన్ నుంచే యుద్ధం చేస్తున్నారు. ఆర్కే ఈ విషయాలను గుర్తు కేసీఆర్ చేసే ప్రగతి భవన్ యుద్ధాన్ని కామెడీ చేశారు. కారణం ఏదైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వారు కరువయ్యారు. కనీసం స్పందించలేనంత రాజకీయ పరిస్థితి ఏర్పడింది. పోరాడేవారిని ప్రజలు వద్దనుకోవడం.. అధికారం ఇచ్చిన వారు కేసుల భయంతో ఉండటం వల్లే ఇలాంటి సమస్య వచ్చిందని ఆర్కే తేల్చారు.

దేశ రాజకీయాల విషయంలో ఆర్కే చేసిన కామెంట్లు మోదీని వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఆయనలో అహం పెరిగిపోయిందని .. నేరుగానే చెప్పారు. ఆయన చేసే కామెంట్స్ బీజేపీ అగ్రనాయకత్వానికి తెలుస్తాయో లేదో కానీ… ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close