హైకోర్టుకు “సాక్షి కోర్టు ధిక్కార” కేసు ..!

సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపై తనకు నమ్మకం లేదని బెంచ్‌ను మార్చాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో సీబీఐ కోర్టు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దుకు సంబందించి తీర్పులను ప్రకటించే అవకాశం ఉంది. సాక్షి మీడియా సీబీఐ కోర్టు తీర్పును ముందుగానే ప్రకటించారని .. ఒక వేళతన తీర్పును సీబీఐ కోర్టు కొట్టి వేస్తే ముందే సాక్షి తీర్పు చెప్పిందని అనుకుంటారని.. అదే సమయంలో విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు కూడా న్యాయమూర్తి అనుమతించారని రఘురామ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే ఈ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

మరో వైపు సాక్షిమీడియా పై రఘురమకృష్ణరాజు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటి,న్‌పై సీబీఐ కోర్టు విచారణ ముగించింది. కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. గత నెల ఇరవై ఐదో తేదీన సీబీఐ కోర్టు తీర్పు రాక ముందే సాక్షి వెబ్ మీడియాలో తీర్పును ప్రకటించారు. ఇది కుట్రపూరితమని .. కోర్టు ధిక్కరణ అని ఆరోపిస్తూ రఘురామ పిటిషన్ వేసారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. సాక్షి ఎడిటర్‌తో పాటు సీఈవో కూడా విచారణకు హాజరయ్యారు. తమ ఉద్యోగి తప్పిదమేనని వారు వివరణ ఇచ్చారు. విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు .. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం హైకోర్టుకు ఉంది కాబట్టి.. బదిలీ చేస్తున్నట్లుగా తెలిపింది.

జగన్, విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. వారు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారంటూ ఇద్దరి బెయిళ్లను రద్దు చేయాలని విడివిడిగా రఘురామ పిటిషన్లు వేశారు. విడివిడిగానే విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు తీర్పును వెల్లడించాల్సి ఉంది. ఈ లోపే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ కారణంగా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close