దుర్గగుడిలో అవినీతి ఆనకొండలు..! కానీ చిన్న చేపలే బలి..!

విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ మూడు రోజుల పాటు చేసిన సోదాల్లో… అడుగుకో అక్రమం బయటపడటంతో ఇప్పుడు దాన్ని కింది స్థాయి ఉద్యోగులకు చుట్టేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పటి వరకూ 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో ఐదుగురు సూపరిండెంటెట్లు కూడా ఉన్నారు. మరికొంత మందిపైనా చర్య తీసుకునేందుకు రంగం సిద్ధమయిందన్న ప్రచారం జరుగుతోంది. ఏసీపీ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నామని.. ముందు ముందు మరింత మంది కీలక వ్యక్తులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వర్గాలు చెబుతున్నాయి. ఇలా సస్పెన్షన్ వేటు వేస్తోంది ఈవో సురేష్ బాబు. అసలు ఆయనపైనే అనేకానేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరిగే ప్రతీ వ్యవహారం ఆయన కనుసన్నల్లోనే జరగుతుతుంది.

ప్రతీ దానికి ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే.. అనూహ్యంగా ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. కింది స్థాయి ఉద్యోగులపైన మాత్రమే వేటు వేస్తున్నారు. అదే సమయంలో ఈవో సురేష్ బాబుపై దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. మ్యాక్స్ అనే సంస్థకు సెక్యూరిటీ టెండర్లను అప్పగించారు. అందులో అనేక అవకతవకలు జరిగాయి. టెండర్ ఆమోదం పొందకపోయినా మ్యాక్స్ సంస్థకు పెద్ద ఎత్తున నిధులు చెల్లించారంటూ అర్జునరావు సురేష్ బాబుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో మొత్తం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో దుర్గగుడి అవినీతి వ్యవహారంపై సెటిల్మెంట్ జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపణలు ప్రారంభించాయి.

స్వరూపానంద స్వామి, సజ్జల రామకృష్ణారెడ్డితో.. దుర్గగుడి ఈవో సురేష్‌బాబు బేరం కుదుర్చుకున్నారని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని… ఈవో సురేష్ బాబును స్వరూపానంద కాపాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే దుర్గగుడిలో ఏసీబీ దాడులు చేయడం అనేది కింది స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయం కాదని.. పై స్థాయిలో చేస్తారని.. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దుర్గగుడిలో అవినీతి మూలవిరాట్టు ఎవరో కనిపెడితే కానీ అవినీతికి అంతం పడదు. లేకపోతే.. యధావిధిగా అవినీతి మయంగానే అమ్మవారి ఆలయం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close