బీజేపీని వ్యతిరేకించే నేతలపై కత్తి వేలాడుతూనే ఉంటుంది : సీపీఐ నారాయణ

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సుప్రీం కోర్టు భిన్నాభిప్రాయాలు పై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తాదా, వర్తించదా అనే అంశంపై ఈ రోజు తీర్పు రావాల్సి ఉన్నా.. సుప్రీం కోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులలో భిన్నభిప్రాయాలు వెలువడిందని, ముమ్మాటికి ఇందులో రాజకీయ జోక్యం చోటుచేసుకుందని వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నాయకులు మీద ఎప్పుడు గానీ కత్తులు వేలాడుతూనే ఉంటుందని ఆరోపించారు. ఆ తరహాలోనే ఈ కేసులో కూడా 17A వర్తిస్తదా, వర్తించదా అనే అంశం వేలాడుతూనే ఉంటుందే తప్ప ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం లేదని తెలిపారు. ఇందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక రకమైన గేమ్ ను ఆడుతుందని తాను అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇది ఒక రకమైన రాజకీయ బెదిరింపు, ఒత్తిడి తప్ప మరొకటి లేదని ఆరోపించారు.

ఏపీలో రాజకీయ పొత్తుల అంశం తేలడం లేదు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీతో తాము కలిసే ఉన్నామని బీజేపీ చెబుతోంది. కానీ టీడీపీ మాత్రం పొత్తులకు వెళ్లడం లేదు. పొత్తులు కావాలంటే తమ పార్టీని అడగాలని టీడీపీకి బీజేపీ నేతలు సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. జనసేనతో ఎన్నికలకు వెళ్తే చాలన్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close